Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
- ల్యాబ్పై దాడి.. డ్రగ్ తయారీ గుట్టురట్టు
- నలుగురు నిందితుల అరెస్ట్
- పరారీలో మరో నలుగురు.. పోలీసుల వేట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mephedrone Seized : యాదాద్రి-భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండమడుగు గ్రామంలో ఎస్ఓటీ (SOT) , స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో దాదాపు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు గ్రామ శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న MH-49-CW-1313 నంబర్ గల ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 27 కిలోల మెఫెడ్రోన్తో పాటు, డ్రగ్స్ తయారీలో ఉపయోగించే సుమారు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను గుర్తించి సీజ్ చేశారు.
వేటుకూరి ల్యాబ్స్లో డ్రగ్స్ తయారీ – అరెస్టయిన నిందితుల వివరాలు
ఈ తనిఖీల విచారణలో భాగంగా కొండమడుగు గ్రామంలోని ‘వేటుకూరి ల్యాబ్స్’లో ఇతర సహచరుల సహకారంతో అక్రమంగా మెఫెడ్రోన్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ల్యాబ్పై దాడి చేసి అక్కడ డ్రగ్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ , ఇతర పరికరాలను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో ప్రధాన ఆర్గనైజర్ నాగ్పూర్కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్ (49), తయారీలో సహకరించిన అస్సాంకు చెందిన ముజామల్ హక్ (25), అక్రమ రవాణాలో భాగస్వామి అయిన నాగ్పూర్కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే (31) , వేటుకూరి ల్యాబ్స్ ఇన్చార్జిగా వ్యవహరించిన చందానగర్కు చెందిన ఉపద్రష్ట రమణ మూర్తి (65)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
పరారీలో మరో నలుగురు నిందితులు
ఈ కేసులో ల్యాబ్ ఏర్పాటు, ముడి పదార్థాల సేకరణ , కెమిస్ట్ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన అస్సాంకు చెందిన ఎం.డి. అయూబ్ అలీ, నాగ్పూర్ డ్రగ్ పెడ్లర్లు చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా , పీర్జాదిగూడకు చెందిన వేటుకూరి ల్యాబ్స్ యజమాని యేటుకూరి రామరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఈ నలుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!