Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Student Priyanka Case: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును.. ఆమె మృతి చెందడంతో హత్య నేరం కిందకు మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన BNS సెక్షన్ 110ను తాజాగా BNS సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు నిందితులను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మృతి నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, కారణాలు, ఇతర అంశాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం నిందితుల విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహం ఉంది.. కిమ్స్ మార్చురీలో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు వైద్యులు.. ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు రాజమండ్రి పోలీసులు .. కిమ్స్ లో శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించనున్నారు.. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ప్రియాంక మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు.. గద్వాల జిల్లాలోని అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. చాలా కాలంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ప్రియాంక కుటుంబ సభ్యులు.. తమ కలల సౌధం కూలిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు.. మరోవైపు.. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయాల ఆర్థిక సహాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం..
రాజమండ్రిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన మెడికో ప్రియాంక.. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!