Sapta Sindhu 2025 : ఆలయ నమూనాల పోటీల్లో ఆర్కిటెక్చర్ విద్యార్థుల అద్భుత ప్రతిభ
- సప్తసింధు పోటీలలో భారతీయ ఆలయాల వైభవం ప్రతిబింబం
- రామప్ప, మొతేరా, విద్యాశంకర నమూనాలతో విద్యార్థుల ప్రతిభ
- భారతీయ శిల్పకళను ప్రపంచానికి చాటే పోటీల ప్రత్యేకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sapta Sindhu 2025 : హైదరాబాద్లో AE ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సప్తసింధు-2025 – ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు” (Inter College Temple Model Making Competition) ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. బుధవారం టీ-హబ్లో జరిగిన ఈ పోటీలు విద్యార్థులు రూపొందించిన ఆలయ నమూనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పద్మశ్రీ బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ, “భారతీయ దేవాలయాల సృజనాత్మకత, శిల్ప సంపద ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆలయాలు భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు” అని అన్నారు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం
పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. న్యాయనిర్ణేతలుగా YTDA సలహాదారు డాక్టర్ ఎస్ సుందరరాజన్, మంథా అసోసియేట్స్ ఎండీ శ్రీ రమేశ్ మంథా, ప్రధాన స్థపతి డిఎన్వి ప్రసాద్ వ్యవహరించారు.
మొదటి బహుమతి (₹50,000): కర్ణాటక శృంగేరి శ్రీ విద్యాశంకర ఆలయ నమూనా – జోగినపల్లి భాస్కర్ రావు (JBR) ఆర్కిటెక్చర్ కళాశాల బృందం.
రెండవ బహుమతి (₹30,000): మొతేరా సూర్య దేవాలయ నమూనా – శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు.
మూడవ బహుమతి (₹20,000): తెలంగాణ రామప్ప ఆలయ నమూనా – హైదరాబాద్ JNFAU విద్యార్థి బృందం.
స్థపతి డిఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన విద్యార్థులందరూ విజేతలే. కేవలం కొలమానాల ప్రకారం మాత్రమే బహుమతులను నిర్ణయించాం,” అని అభినందించారు.
తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ వకుళాభరణం మోహన్ రావు, “ఆలయాల శిల్పకళా వైభవాన్ని నగరానికి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం విశేషం,” అని కొనియాడారు.
విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ, “హైదరాబాద్ చరిత్ర కేవలం 400 ఏళ్ళు కాదని, వేల ఏళ్ల వారసత్వం ఉందని సాక్ష్యాలు చూపుతున్నాయి,” అన్నారు.
సామాజిక కార్యకర్త రేఖారావు, సోషల్ మీడియా కార్యకర్త సురేష్ కొచ్చాటిల్ తదితరులు ఆలయాల విశిష్టతపై తమ అనుభవాలను పంచుకున్నారు.
చరిత్రకారుడు సురేంద్రనాథ్ బొప్పరాజు ఆలయాల శిల్పకళపై స్లయిడ్షో ప్రదర్శించగా, AE ఫౌండేషన్ డైరెక్టర్ సంగీతా మిశ్రా మాట్లాడుతూ, “ఆర్కిటెక్చర్ కేవలం ఆధునిక భవనాల నిర్మాణమే కాదు. భారతీయ నిర్మాణ రంగ చరిత్రను, శిల్ప వైభవాన్ని యువతకు తెలియజేయడమే ఈ పోటీ ఉద్దేశ్యం” అని అన్నారు. విద్యార్థుల రూపొందించిన నమూనాలను 10 రోజుల పాటు టీ-హబ్లో ప్రదర్శిస్తామని తెలిపారు. సప్తసింధు-2025 నిర్వహణలో సహకరించిన బృహత్, నెక్స్ వేవ్, వర్మ ఫౌండేషన్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Medak Murder: మైనర్ న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపు.. కట్చేస్తే..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!