Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం
- వికారాబాద్ జిల్లాలో ఆస్తి కోసం దారుణ హత్య
- మద్యానికి బానిసైన రవి తండ్రిపైనే దాడి
- సుత్తితో మోది తండ్రిని చంపిన దారుణ ఘటన
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు, హత్యాయుధం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది.
గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అంతా వేర్వేరుగా కాపురం పెట్టారు. వీరిలో మూడో కొడుకు రవి భార్య చనిపోయింది. అతనికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గతంలో మేస్త్రీ పని చేసిన రవి.. ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని పిల్లల బాధ్యతను కూడా తల్లి నర్సమ్మే నెరవేరుస్తోంది. మద్యం తాగుతూ రోజూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు రవి.
Also Read
- Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
ఈ క్రమంలో తల్లి నర్సమ్మపై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చేయి విరిగిపోయింది. నర్సమ్మ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత… పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోని మంచంపై ఉన్న తండ్రితో గొడవ పెట్టుకున్నాడు రవి. తండ్రి ఆస్తిలో తన వాటాకు రావాల్సిన భూమి తన పేరిట పట్టా చేయాలని వేధించాడు. కానీ అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఐతే ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు నిరాకరిస్తూనే ఉన్నారు. మద్యం అలవాటు వల్ల భూమి ఎవరికైనా అమ్మేస్తే.. పిల్లలు ఆగమవుతారనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. ఇదే కారణంతో రవి పేరిట పట్టా చేసేందుకు ససేమిరా అంటున్నారు.
కానీ ఇదే విషయంలో తల్లిదండ్రులపై కోపంగా ఉన్న రవి.. తండ్రిపై దాడి చేశాడు. సుత్తితో తలపై బాదాడు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత 100 నంబర్ కు డయల్ చేసిన రవి.. తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని చంపేందుకు ఉపయోగించిన సుత్తిను స్వాధీనం చేసుకున్నారు..
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!