Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం
- వికారాబాద్ జిల్లాలో ఆస్తి కోసం దారుణ హత్య
- మద్యానికి బానిసైన రవి తండ్రిపైనే దాడి
- సుత్తితో మోది తండ్రిని చంపిన దారుణ ఘటన
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు, హత్యాయుధం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది.
గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అంతా వేర్వేరుగా కాపురం పెట్టారు. వీరిలో మూడో కొడుకు రవి భార్య చనిపోయింది. అతనికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గతంలో మేస్త్రీ పని చేసిన రవి.. ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని పిల్లల బాధ్యతను కూడా తల్లి నర్సమ్మే నెరవేరుస్తోంది. మద్యం తాగుతూ రోజూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు రవి.
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
ఈ క్రమంలో తల్లి నర్సమ్మపై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చేయి విరిగిపోయింది. నర్సమ్మ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత… పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోని మంచంపై ఉన్న తండ్రితో గొడవ పెట్టుకున్నాడు రవి. తండ్రి ఆస్తిలో తన వాటాకు రావాల్సిన భూమి తన పేరిట పట్టా చేయాలని వేధించాడు. కానీ అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఐతే ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు నిరాకరిస్తూనే ఉన్నారు. మద్యం అలవాటు వల్ల భూమి ఎవరికైనా అమ్మేస్తే.. పిల్లలు ఆగమవుతారనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. ఇదే కారణంతో రవి పేరిట పట్టా చేసేందుకు ససేమిరా అంటున్నారు.
కానీ ఇదే విషయంలో తల్లిదండ్రులపై కోపంగా ఉన్న రవి.. తండ్రిపై దాడి చేశాడు. సుత్తితో తలపై బాదాడు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత 100 నంబర్ కు డయల్ చేసిన రవి.. తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని చంపేందుకు ఉపయోగించిన సుత్తిను స్వాధీనం చేసుకున్నారు..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!