Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambasivarao said that it is not good to be angry with BJP: బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఈనెల 25 నుంచి నియోజకవర్గాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశం లో రాజ్యాంగాన్ని, హక్కులను తుంగలో తొక్కుతోంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, ఆప్ ప్రభుత్వం లను కూల్చివేయాని చూస్తుందన్నారు. విచారణ సంస్థ లను అడ్డుపెట్టుకుని రాజ్యాంగం ను కూల్చేయాలని చూస్తుందన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ఆకలి బాధలు, అసమానతలు పెరిగిపోయాయి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటున్నారని తెలిపారు. మోడీ వచ్చిన తర్వాత దేశం ఏం మంచి జరిగింది? అని ప్రశ్నించారు. దేశం లో అత్యంత అవినీతి ప్రధాని నరేంద్ర మోడీ అని ఆరోపించారు.
Read also:ELON MUSK : మూతపడ్డ బ్యాంక్.. కొనుగోలుకు మస్క్ ప్లాన్
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అదానీ 12లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగిందన్నారు. 2లక్షల కోట్ల, రూపాయల కుంభకోణాలు మోదీ హయాం లో జరిగాయన్నారు. ఆయన నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారన్నారు. అదానీ పోర్ట్ లో 21కోట్ల హెరాయిన్ దొరికింది ఒక్క కేసైనా పెట్టారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతి లేని బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా? అని మండిపడ్డారు. బుల్డోజర్ లు పేదల గుడిసెలపై ఎక్కిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడుకోవడం అనేది కమ్యునిస్టు లు నిర్ణయించారన్నారు. బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు అంటూ ఎద్దేవ చేశారు. సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని నిప్పులు చెరిగారు. బీజేపీ ని వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ కు మద్దతు ఉంటుందన్నారు. గవర్నర్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరా.? అంటూ మండిపడ్డారు.
Read also:KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
ఇదేనా మోదీ మార్క్ పాలన అంటూ ప్రశ్నించారు. లిక్కర్ కేసు కేవలం కవిత కోసం కాదు తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ కన్ను పడిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ తప్పు చేసిన వారందరిపై అలానే వ్యవహరించాలని అన్నారు. పోడు పట్టాలు గతంలో చెప్పిన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 58, 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి 5లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. నీరు పేదలకు ఇల్లస్థలాలు ఇచ్చే వరకు జెండా పాతి ఇల్లస్థలాల కోసం పోరాడుతామన్నారు. జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఇంటింటికీ వెళ్తామన్నారు. జిల్లాల వారీగా నేతలకు బాధ్యత ఇస్తున్నామన్నారు. 25న బయ్యారం పేరులో ఈ యాత్ర లు ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. 33 జిల్లాలకు వెళ్ళేలా మరోయాత్ర చేపడతామన్నారు. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ యాత్ర ముగిస్తామని స్పష్టం చేశారు. 119 నియోజక వర్గాల వారిగా సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!