Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా హైదరాబాద్ వాసులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టి బస్సు బోల్తాపడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగు సజీవ దహనం మయ్యారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో మొత్తం డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటన అనంతరం కొందరు సురక్షితంగా బయట పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదంలో జీపు డ్రైవరికి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. మే 29న పుట్టిన రోజు వేడుకలకు ఆరెంజ్ ట్రావెల్ బస్సులో హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళిన బృందం. తిరిగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించడంతో.. బస్సు పూర్తీగా దగ్ధమైంది. మంటల్లో నలుగు సజీవ దహనం కాగా మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మొత్తం 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో అర్జున్(37), సరళ(32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత(9), అనిత(40) వున్నారు. బాధితులంతా హైదరాబాద్ లోని ఏకాలనీకి చెందినవారో ఇంకా పూర్తీ వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.