Revanth Reddy: ఒక్కసారి ఎమ్మెల్యే అయి.. రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్లు సంపాదించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Sensational Allegations On Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ఆ పార్టీకి రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశాడు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ చేసిన తప్పా..? మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిపించడం తప్పా..? అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెట్టంత మనిషిని చేసిందని, కానీ ఆయన కాంగ్రెస్ను కత్తితో పొడిచిపోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్మణ్తో రాజగోపాల్ రెడ్డి దోస్తీ చేశాడని.. కాంగ్రెస్ పార్టీని చంపనీకి ఆయన వచ్చాడని విమర్శించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా ఏం సంపాదించలేదని.. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయి రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అమ్ముడుపోయిన సన్నాసులతో ఊరంతా పోతుందా..? అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీపై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో బీఆర్ఎస్గా మారే అవకాశం లేదని బాంబ్ పేల్చారు. గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పాల్పడిన వసూళ్లకు సంబంధించి.. తాను త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. అలాగే.. కేంద్ర ఇన్కమ్ టాక్స్ సంస్థకు కూడా టీఆర్ఎస్పై ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయిస్తానన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే.. ఈ కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, దీనిపై కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో అభివృద్ధి జరిగిందని శూన్యమన్న ఆయన.. అమ్ముడుపోయిన నేతలను ఆదరించొద్దని ప్రజల్ని కోరారు. నియోజక ఆడబిడ్డగా ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలను నమ్మి మోసపోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!