Mallikarjun Kharge: తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఒక లక్ష నలభై వేల అప్పు చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేదరికాన్ని నిర్మూలించాలని భూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
భారతదేశంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలకు మోసం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు చదువు కోసం 5లక్షలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఖర్గే అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అనేక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంటులలో 15లక్షల రూపాయల వేస్తానని అన్నారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలలో ఉండకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.
Naresh: అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. దేశంలోనే మొదటి వ్యక్తి
తాజావార్తలు
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!