Mallikarjun Kharge: తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఒక లక్ష నలభై వేల అప్పు చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేదరికాన్ని నిర్మూలించాలని భూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
భారతదేశంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలకు మోసం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు చదువు కోసం 5లక్షలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఖర్గే అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అనేక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంటులలో 15లక్షల రూపాయల వేస్తానని అన్నారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలలో ఉండకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.
Naresh: అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. దేశంలోనే మొదటి వ్యక్తి
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!