CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ఒక బాధ్యత లేని పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కైకలూరు, కలిదిండి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీని తీవ్రంగా విమర్శిస్తూ గతంలో రాష్ట్రంలో నెలకొన్న నక్సలైట్ సమస్య, రాయలసీమ ఫ్యాక్షనిజం, హైదరాబాద్లో మత విద్వేషాలు, గంజాయి, రౌడీయిజం వంటి అంశాలను ప్రస్తావించారు. తనకు 48 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నక్సలైట్ సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు. తాను తిరుమల వెళ్తున్న సమయంలో నక్సలైట్లు క్లైమర్ మైన్లు పెట్టినా వెంకటేశ్వరస్వామి తనను కాపాడారని, అయినప్పటికీ తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
ఒకప్పుడు రాయలసీమలో ముఠా కక్షలపై సినిమాలు తీసేవారని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో తమ పార్టీకి చెందిన వారినైనా అరెస్ట్ చేయించామని చెప్పారు. ఇక, హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన సమయంలో ఆరు నెలల పాటు కర్ఫ్యూ విధించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో హైదరాబాద్లో అభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు.
Also Read
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై చర్యలు
రాష్ట్రంలో ఎవరూ రౌడీగా ఉండకూడదనే లక్ష్యంతో గతంలోనే చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. అయితే 2019–24 మధ్య కాలంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. గంజాయిని వాణిజ్య పంటగా సాగు చేసే పరిస్థితులు ఏర్పడితే శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. చాలామంది గంజాయికి అలవాటు పడి ఇప్పటికీ ఆ వ్యసనం నుంచి బయటపడటం లేదని అన్నారు.
పొగాకు ధరలపై కేంద్రంతో చర్చలు
పొగాకు రైతులకు సరైన ధర కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో ధరలు ఇప్పిస్తామని చెప్పి రైతుల పంటను తొక్కేసి పాడు చేశారని విమర్శించారు.
శాంతిభద్రతలపై కఠిన వైఖరి
ఎవరైనా మద్యం సేవించి స్వైర విహారం చేస్తుంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ను అదుపులోకి తీసుకురావాలా? వద్దా? అని చంద్రబాబు ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గుంటూరులో టీడీపీ కార్యకర్త కుటుంబానికి చెందిన ఆడబిడ్డను అవమానించిన ఘటనలో తాను చర్యలు తీసుకుని అరెస్ట్ చేయించానని తెలిపారు. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, ఆమెపై చేతులు వేసి దురుసుగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్లపైకి వచ్చి గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీయిజం, అరాచకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!