Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu on Mega DSC: డీఎస్సీ విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో కైకలూరు, కలిదిండి సభలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరు కోర్టులను ఆశ్రయించారని, అనంతరం కోర్టులో ఉన్న అంశాలను పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి ఏడాది తర్వాత వైసీపీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీలో నీట్ లీక్ జరిగితే ఇక్కడ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల పేరుతో అనవసర ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రోడ్లపై స్వైరవిహారం చేస్తే సహించను
అనవసర ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడాన్ని ప్రభుత్వం సహించదని చంద్రబాబు స్పష్టం చేశారు. రోడ్లన్నీ కొందరు స్వైరవిహారం చేయడానికి, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలను తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తాను మౌనంగా ఉంటే ఎవరినీ నిద్రపోనివ్వరని, రోజూ రౌడీయిజం చేసే పరిస్థితులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Also Read
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
అభివృద్ధి పనులపై క్రెడిట్ వ్యాఖ్యలు
భోగాపురం విమానాశ్రయం విషయంలోనూ రాజకీయంగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భోగాపురం తానే నిర్మించానని కొందరు చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా దానిని తానే పూర్తి చేశానని చెప్పుకునే పరిస్థితి వస్తుందని, రేపు అమరావతి పూర్తయితే అది కూడా తానే నిర్మించానని చెప్పుకునే అవకాశం ఉందని విమర్శించారు.
రౌడీయిజం చేయను.. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా
తాను రౌడీయిజం చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే రౌడీలకు మాత్రం సింహ స్వప్నంగా ఉంటానని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. కాగా, డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!