Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Perni Nani: పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
మీ జేబులోని లక్ష కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్టు కడితే.. పిల్లర్లు కుంగి పోతున్నాయి. ఇందులో అవినీతి జరిగిన ప్రతి రూపాయిని మళ్లీ మీకు జేబులో పెడతాం. అలాగే.. ‘ఇప్పుడు తెలంగాణలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య కొట్లాట జరుగుతోంది. దేశంలో ప్రధానమంత్రి మోదీ… రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ పదవుల్లోనే శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ముందు వరుసలో మాకు బీఆర్ఎస్ పార్టీ పోటీగా ఉంటే… దాని వెనకాల బీజేపీ, ఎంఐఎం ఉంది. దేశంలో బీజేపీ పార్టీ వెనకాల బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మాకు వ్యతిరేకంగా ఎంఐఎంను దింపి ఓట్లను చీల్చుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన వారిపై సీబీఐ ఈడీ కేసులు నమోదు అవుతాయి. నామీద కూడా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారణ జరిపారు. నా ఇంటిని, తాళాలను కూడా లాక్కున్నారు. నామీద అక్రమ కేసులు పెట్టి పార్లమెంటు నుండి బయటకు పంపారు. దేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో నాకు నివాసం ఉందని సంతోషంగా ఇంటి తాళాలు ఇచ్చి వేశాను. కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ కేసులు ఎందుకు నమోదు అవుతలేవో ప్రజలు తెలుసుకోవాలి.
Also Read: Jaipur tinder murder Case: టిండర్లో పరిచయం, డేట్.. కట్ చేస్తే కిడ్నాప్, దారుణహత్య
కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలో మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు వాటిపై చట్టసభల్లో మద్దతు తెలపడమే నిదర్శనం. మీతో నాకు రాజకీయ సంబంధమే కాదు.. కుటుంబ-రక్త సంబంధం కూడా ఉంది. మా నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి మొదలుకొని మా నాన్న రాజీవ్ గాంధీ వరకు మీతో ఉన్న సంబంధమే నాకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధతను కల్పించి ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!