Mallikarjun Kharge: తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఒక లక్ష నలభై వేల అప్పు చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేదరికాన్ని నిర్మూలించాలని భూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
భారతదేశంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలకు మోసం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు చదువు కోసం 5లక్షలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఖర్గే అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అనేక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంటులలో 15లక్షల రూపాయల వేస్తానని అన్నారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలలో ఉండకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.
Naresh: అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. దేశంలోనే మొదటి వ్యక్తి
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!