Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Raghunandan Rao Challenges Congress On Bc Reservations

MP Raghunandan Rao : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు రఘునందన్ రావు సవాల్

Published Date :July 26, 2025 , 6:01 pm
By Gogikar Sai Krishna
  • బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రచారంపై రఘునందన్ విమర్శలు
  • "బీసీలకు ఎవరు ఏం చేశారు?" – బహిరంగ సవాల్
  • కాంగ్రెస్ మంత్రివర్గం, ముఖ్యమంత్రుల గణాంకాలపై ప్రశ్నలు
  • కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి పదవుల్లో బీజేపీ ప్రాతినిధ్యం
MP Raghunandan Rao : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు రఘునందన్ రావు సవాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

MP Raghunandan Rao : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు.

“నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీలకు ఏం చేసిందో నేను చెబుతా. మరి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్, విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా?” అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను గణాంకాలతో చర్చకు వస్తానని, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తానని స్పష్టం చేశారు.

Also Read

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
  • Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం మళ్ళీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం కరెక్టేనా ఆది సీనన్నా?” అని ప్రశ్నించారు.

World Leaders: భార‌త్‌లో చదువుకున్న ప్రపంచ నాయకులు వీరు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 250 మందిని ముఖ్యమంత్రులను చేస్తే అందులో 43 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారని తెలిపారు. అదే బీజేపీ 68 మంది ముఖ్యమంత్రులను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అంటే, “బీజేపీ 31 శాతం ఓబీసీలను సీఎంలుగా చేసింది, కాంగ్రెస్ పార్టీ 17 శాతం మందిని మాత్రమే సీఎం చేసింది” అని వివరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీకి బండి సంజయ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారని పేర్కొన్నారు.

ఎన్‌డీఏ కూటమిలో 20 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఐదుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు మైనార్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని తెలిపారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు ఓబీసీలు మంత్రులుగా ఉంటే, మోడీ క్యాబినెట్‌లో 21 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని గణాంకాలు చెప్పారు.

దేశానికి రాష్ట్రపతిగా దళితులను, గిరిజనులను చేసిన ఘనత బీజేపీదని రఘునందన్ రావు అన్నారు. తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే, అందులో ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చామని గుర్తుచేశారు.

కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ ఎపిసోడ్ పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెచ్‌సీయూ (HCU) భూముల విషయంలో కేటీఆర్ బీజేపీ ఎంపీలపై “బట్ట కాల్చి మీద వేశాడని” మండిపడ్డారు. హెచ్‌సీయూ విషయంలో కేటీఆర్ మొదట కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తనపై ఆరోపణలు చేశారని రఘునందన్ రావు గుర్తుచేశారు.

Greaves Eltra City XTRA: పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా?.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఆటోపై ఓ లుక్కేయండి.. సింగిల్ ఛార్జ్ తో 170KM రేంజ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BC Reservations
  • bjp vs congress
  • raghunandan rao
  • Telangana Politics

తాజావార్తలు

  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..

  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!

  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions