World Leaders: భారత్లో చదువుకున్న ప్రపంచ నాయకులు వీరు..
- ప్రపంచ దేశాధినేతలకు చదువు చెప్పిన భారత్..
- విదేశాలకు అధినేతలకు పనిచేసిన వారు ఒకప్పుడు భారత విద్యార్థులే..
- ఆంగ్ సాన్ సూకీ నుంచి హమీద్ కర్జాయ్ వరకు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Leaders: భారతదేశం ప్రాచీన కాలంలో అనేక విద్యలకు నిలయంగా ఉండేది. మన రాజులు తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల వంటి అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. దురాక్రమణదారుల దాడుల్లో చాలా వరకు ఇవి నాశనం అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచంలోని పలుదేశాల నుంచి వచ్చి ఇక్కడి విద్యను అభ్యసించేవారు. ఇదంతా పక్కన పెడితే, ఆధునిక యుగంలో కూడా పలువురు భారతదేశంలో విద్యను అభ్యసింది, ఆ తర్వాత తమ సొంత దేశాలకు అధినేతలుగా ఎదిగారు.
1) ఆంగ్ సాన్-సూకీ -మయన్మార్
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
మయన్మార్ దేశాధినేతగా పనిచేసిన నోబెల్ శాంతి అవార్డు గ్రహీత అయిన ఆంగ్ సాన్ సూకీ ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ పొందారు. ఆమెకు 1991లో నోబెల్ బహుమతి వచ్చింది.
2) హమీద్ కర్జాయ్ – ఆఫ్ఘనిస్తాన్
హమీర్ కర్జాయ్ 2004-2014 వరకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతని సమయంలో భారత్-ఆఫ్ఘన్ సంబంధాలు చాలా బలోపేతం అయ్యాయి. ఈయన 1983లో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
3) బింగు వా ముతారికా – మలావి
ఆగ్నేయాఫ్రికా దేశమైన మలావికీ బింగు వా ముతారికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పొందారు.
4) ఒలుసెగన్ ఒబాసాంజో- నైజీరియా
ఒలుసెగన్ మాథ్యూ ఒకికియోలా అరెము ఒబాసాంజో 1999 నుండి 2007 వరకు నైజీరియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన భారత్లో తన సైనిక శిక్షణ పొందారు. కిర్కీలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీలో ఇంజనీరింగ్ లో, ఆ తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ-వెల్లింగ్టన్లో శిక్షణ తీసుకున్నారు. ఆయన ఫిబ్రవరి 13, 1976 నుండి అక్టోబర్ 1, 1979 వరకు నైజీరియాకు సైనిక పాలకుడిగా పనిచేశారు.
5) బాబూరామ్ భట్టారాయ్ – నేపాల్
ఆగస్టు 2011 నుంచి మార్చి 2013 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయన 1986లో న్యూఢిల్లీలోని జేఎన్యూ నుంచి అర్బన్ ప్లానింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు.
6) కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్- ఒమన్
దివంతగ ఒమన్ రాజు కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ ఒకప్పుడు పూణేలో చదవుకున్నాడు. ఇతడికి భారత రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాల్ శర్మ బోధించారు.
తాజావార్తలు
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..