Poster War: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతోంది. ఐదేళ్లు పూర్తి అయినా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదని, ఇంకెన్నినాళ్లు ఈ ఫ్లైఓవర్ కడుతారంటూ మోదీని ప్రశ్నిస్తూ అడుగడుగున పోస్టర్లు వెలిశాయి.

Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
Read Also: Super Sketch: కృష్ణ కోసం సిమ్రాన్ను చంపిన జ్యోతి.. దారం, ముక్కు పుడకే ఆధారం
ఇదిలా ఉంటే బీజేపీ కూడా అంతేధీటుగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యానికి కారణం అంటూ మంత్రి కేటీఆర్ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పసుపు బోర్డు గురించి ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలుగులోకిరాగా.. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తలదించుకునేలా చేశారంటూ పోస్టర్లు వెలిశాయి.

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత అరవింద్ ప్రధానంగా పసుపుబోర్డు హామీ ఇచ్చారు. దీనిని ప్రశ్నిస్తూ ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపుబోర్డు అంటూ ‘‘పసుపు కలర్ బోర్డు’’తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ పోస్టర్ వార్ తో ఇరు పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. మరోసారి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే అధికారం లేకపోతే ప్రతిపక్షం టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు చేస్తోంది.
- Tags
- bjp
- BRS
- ktr
- mp arvind
- poster war
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.