Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Seller: అతను ఓ పానీపూరీ వ్యాపారి. బాగానే సాగుతున్న అతని వ్యాపారంలో కొత్తగా ఇంకోవ్యాపారం మొదలు పెట్టాడు ప్రభుద్దుడు. అతితెలివి ఉపయోగించి పానీపూరీ చాటున అక్రమ దందాను మొదలుపెట్టాడు. ఈజీ మనీ సంపాదన కోసం గంజాయి అమ్మకం షురూ చేశాడు. చివరకు అడ్డంగాబుక్కై కటకటాలపాలయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గత కొంత కాలంగా చీకటి వ్యాపారం చేస్తుండటంతో.. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతానికి చెందిన ముస్తాపూర్ ప్రశాంత్ అనే యువకుడు తాజ్మహల్ హోటల్ ఎక్స్ రోడ్డు, భారతి విద్యా భవన్ రోడ్డులో వేరు వేరు చోట్ల పానీ పూరి స్టాల్స్ను పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. అయితే పానీపూరి అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించటం ప్రశాంత్కు కష్టంగా మారింది. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాదులో గంజాయికి ఎక్కువగా గిరాకీ ఉన్నట్లుగా గుర్తించాడు. గంజాయి విక్రయం ద్వారా తక్కువ కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాడు. పానీపూరి కోసం తన వద్దకు వచ్చే కాలేజీ స్టూడెంట్స్కు గంజాయిని విక్రయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే దూల్పేటకు చెందిన యశ్వంత్ గౌతమ్ అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. యశ్వంత్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా.. అతడి వద్ద నుంచి ప్రశాంత్ 25 వేలకు గంజాయిని కొనుగోలు చేశాడు.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
అయితే.. ఆ గంజాయిని రూ. 45 వేలకు విక్రయించాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేటు దగ్గరకు వచ్చి అవసరమైన వినియోగదారులకు గంజాయిని విక్రయించడానికి ప్రయత్నించాడు. కాగా.. పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావటంతో వెంటనే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి ప్రశాంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రశాంత్ దగ్గర ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో బ్రౌన్ టేపుతో చుట్టబడిన గంజాయి ప్యాకెట్ కనిపించింది. దీంతో పోలీసులు వెంటనే ప్రశాంత్ను అరెస్టు చేసి 2.8 కేజీల గంజాయిని, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్కు గంజాయి విక్రయించిన యశ్వంత్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంసాఘిక కార్యకలపాలు, చట్టవ్యతిరేకకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసినట్లు.. డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు తెలిపారు.
Aadhipurush : ఆదిపురుష్ లో ఆ సన్నివేశం మార్పు పై తీవ్ర ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్..!!
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!