TPCC Mahesh Goud : కేసీఆర్ దీక్ష నాటకం.. మహేష్ గౌడ్ ఫైర్
- ఉనికి కోసం బీఆర్ఎస్ దీక్షా దివస్ చేయాలని చూస్తుంది
- కేసీఆర్ చేసిన దీక్ష ఎలా చేశాడు.. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు
- కేసీఆర్ దీక్ష ఓ నాటకం
- తెలంగాణ సోనియా గాంధీ వల్లే వచ్చింది. -మహేష్గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. “ఇది ఏ దీక్ష? ప్రజలు మోసపోయారు… కానీ నిజాలు బయటకు వచ్చాయి” అని ఆయన అన్నారు.
అదే సమయంలో, “తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. వాళ్లే తమ ప్రాణాలు అర్పించి తెలంగాణను తెచ్చారు” అని తెలిపారు. “వచ్చిన తెలంగాణను మాత్రం కేసీఆర్, అతని కొడుకు, అతని మేనల్లుడు కలిసి దోచుకున్నారు. రాష్ట్రాన్ని కుటుంబ ఆస్తిలా భావించి పాలించారు” అని ఆరోపించారు. తెలంగాణ సృష్టిలో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేసిన మహేష్ గౌడ్, “కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలి. నిజమైన తెలంగాణ తల్లి ఆమె” అని అన్నారు.
Also Read
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
అమరవీరులకే తెలంగాణ రుణపడి ఉందని, కేసీఆర్ పేరుకు మాత్రమే ఉద్యమం నడిపాడని వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ, “హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టడానికి ధైర్యం దొరకలేదు. దళితులు, బీసీలకు అయితే అగ్గిపెట్టె కూడా దొరికింది” అని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజా ఆమోదం కోల్పోయి, కొత్త రాజకీయ స్థానం కోసం ప్రయత్నిస్తోంది అని పేర్కొన్నారు. “కేసీఆర్కు కూడా బీఆర్ఎస్ శకం ముగిసిన విషయం తెలుసు. అందుకే అసంబద్ధ దీక్షలు, కార్యక్రమాలతో ప్రజల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు.
SSC Recruitment 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7,948 ఎంటీఎస్, హవల్దార్ జాబ్స్..
రాష్ట్రంలోని కార్పోరేషన్ చైర్మన్ల పదవులకు కొనసాగింపు లేదని, వారు ఇకపై DCCలుగానే పనిచేస్తారని తెలిపారు. ఈ క్రమంలో నల్గొండ DCC అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తాను కలిసిన విషయం స్పష్టం చేశారు. గతంలో పున్నా కైలాస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆయన కోమటిరెడ్డికి వివరణ ఇచ్చారని చెప్పారు. బీజేపీ-ఓవైసీ సంబంధాలపై వ్యాఖ్యానిస్తూ.. “బీజేపీ నేతలు ఓవైసీని తలుచుకోకుండా టిఫిన్ కూడా తినలేరు. రోజంతా ఓవైసీ జపమే. వాళ్ల సమస్య వాళ్లదే… దానికి మనం ఏమి చేయలేము” అన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ, త్వరలో ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు. బీసీ బిల్లుకు అడ్డుకట్ట వేస్తున్నది బీజేపీ అని ఆరోపించారు. “బీసీ నేతలు కాంగ్రెస్ని నిలదీయడం కాదు… అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్లను నిలదీయాలి. సాయం చేసినవారి ఇంటి ముందు నిరసన ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.
“మేము బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. మాపై ఆందోళనలు చేస్తే నష్టమైతే ప్రజలకే” అని స్పష్టం చేశారు. తాను నక్సలైట్ బాధితుడినని గుర్తుచేసుకున్న మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఎలాంటి హింసను కూడా సమర్థించదని తెలిపారు. “పోలీసుల కాల్పుల్లో కూడా కొందరు చనిపోయారు. మావోయిస్టుల చేతుల్లో కూడా ప్రాణాలు పోయాయి. కానీ ఏ హింసనూ సమర్థించను” అని అన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలని, కానీ లొంగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా కాల్చివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్కు 3వ స్థానం.. చైనా, పాక్ ర్యాంకులు ఎంతంటే..
- Tags
- BRS
- congress
- kcr
- Telangana Politics
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!