NVSS Prabhakar: కేటీఆర్ ఒక లీక్ వీరుడు.. ఆయన శాఖ అవినీతికి మారుపేరుగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar Sensational Comments On Minister KTR: మంత్రి కేటీఆర్ ఒక లీక్ వీరుడని, ఆయన శాఖ అవినీతికి మారుపేరుగా మారిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. అంబర్పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ కారిడార్ పనులు ఆలస్యం అవ్వడానికి కారణం.. పురపాలక శాఖ మంత్రి నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. స్థానికులపై ప్రభుత్వం కక్ష కట్టిందని.. 3 రకాల నష్ట పరిహారాలు ఇచ్చారని చెప్పారు. పనులు జరగకపోవడానికి జీహెచ్ఎంసీ వైఫల్యమే కారణమన్నారు. కరెంట్ లైన్తో పాటు వాటర్ లైన్ షిఫ్ట్ కాలేదన్నారు. ఇంకా 28 కట్టడాలు తొలగించాలని తెలుసుకొని.. కేటీఆర్ చెంపలేసుకొని, ఆ పోస్టర్లను తీయించారని పేర్కొన్నారు. కేటీఆర్కు తన శాఖ మీద పట్టు లేదని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖను హై కోర్ట్ పలు అంశాల్లో తప్పు బట్టిందని గుర్తు చేశారు. ‘కేటీఆర్.. ముందు నీ శాఖ గురుంచి పట్టించుకో’ అంటూ సూచించారు. అడుగడుగునా తాము వెంటపడుతున్నామన్నారు. నీటి పన్ను లేదని చెప్పిన మునిసిపల్ మంత్రి.. రూ.10 వేల బిల్లు వేశారని వెల్లడించారు. కాగా.. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో జాప్యంపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుగుచూశాయి. ఐదేళ్లు అవుతున్నా, 40 శాతం పనులు కూడా పూర్తవ్వలేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ పోస్టర్లో ముద్రించారు. ఈ పోస్టర్ల కలకలం నేపథ్యంలోనే.. ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ పైవిధంగా స్పందించారు.
Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన సాగడం లేదని ఆరోపించారు. కవిత న్యాయ సలహా కోసం ప్రభుత్వ అధికారులను వాడుకుంటుందని.. పోలీసు ఉన్నత, న్యాయ ఉన్నత అధికారులు కవిత ఈడీ కేసు రివ్యూ మీటింగ్లో పాల్గొంటున్నారంటూ చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, పంట నష్టం, నగరంలో భవనాలు కూలుతున్నా, కాలుతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. రాష్ట్రంలో బంధుప్రీతితో కూడుకున్న పాలన నడుస్తోందన్నారు. మంత్రులు ప్రభుత్వపరమైన విషయాలు పక్కన పెట్టేసి.. రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో అనేకసార్లు పంట నష్టం జరిగినా.. సీఎం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీలో రోజుకో విషయం వెలుగుచూస్తోందని, తవ్వుతున్న కొద్ది పేర్లు బయటికి వస్తున్నాయని అన్నారు. ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో పేపర్లు లీకేజీ జరిగాయని తెలుస్తోందని, దీనికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్వయంగా కేసీఆర్ తన తనయుడైన కేటీఆర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!