Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. దీనికి తండ్రి వ్యతిరేకించాడు. కానీ ఆ అమ్మాయి సరేమీరా అంది. వారిద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి లైసెన్స్ ఉన్న తుపాకీతో బాలికపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పాఠశాలలో ఉపాధ్యాయురాలి పనిచేస్తుండగా, తండ్రి కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
మైన్పురి జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ కాస్గంజ్లోని ఓ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాగా బాలిక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. తండ్రి అమ్మాయికి చాలా నచ్చజెప్పాడు, కానీ ఆమె ప్రేమ మైకంలో వినలేదు. పైగా ‘నేను చదువుకున్నాను, నా కాళ్లపై నేను నిలబడతాను, నేనే నిర్ణయాలు తీసుకోగలను’ అని తన తండ్రికి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
కోపంలో తండ్రి గదిలోకి వెళ్లి లైసెన్స్ ఉన్న తుపాకీని తీసుకొచ్చాడు. దీంతో బాలికపై తుపాకీ గురిపెట్టి కాల్చేసి.. పారిపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త, కుమార్తెను చూసి భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరువు పోతుందనే భయంతో తండ్రి చేసిన పనితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!