Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. దీనికి తండ్రి వ్యతిరేకించాడు. కానీ ఆ అమ్మాయి సరేమీరా అంది. వారిద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి లైసెన్స్ ఉన్న తుపాకీతో బాలికపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పాఠశాలలో ఉపాధ్యాయురాలి పనిచేస్తుండగా, తండ్రి కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
మైన్పురి జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ కాస్గంజ్లోని ఓ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాగా బాలిక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. తండ్రి అమ్మాయికి చాలా నచ్చజెప్పాడు, కానీ ఆమె ప్రేమ మైకంలో వినలేదు. పైగా ‘నేను చదువుకున్నాను, నా కాళ్లపై నేను నిలబడతాను, నేనే నిర్ణయాలు తీసుకోగలను’ అని తన తండ్రికి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
కోపంలో తండ్రి గదిలోకి వెళ్లి లైసెన్స్ ఉన్న తుపాకీని తీసుకొచ్చాడు. దీంతో బాలికపై తుపాకీ గురిపెట్టి కాల్చేసి.. పారిపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త, కుమార్తెను చూసి భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరువు పోతుందనే భయంతో తండ్రి చేసిన పనితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!