Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. దీనికి తండ్రి వ్యతిరేకించాడు. కానీ ఆ అమ్మాయి సరేమీరా అంది. వారిద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి లైసెన్స్ ఉన్న తుపాకీతో బాలికపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పాఠశాలలో ఉపాధ్యాయురాలి పనిచేస్తుండగా, తండ్రి కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
మైన్పురి జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ కాస్గంజ్లోని ఓ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాగా బాలిక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. తండ్రి అమ్మాయికి చాలా నచ్చజెప్పాడు, కానీ ఆమె ప్రేమ మైకంలో వినలేదు. పైగా ‘నేను చదువుకున్నాను, నా కాళ్లపై నేను నిలబడతాను, నేనే నిర్ణయాలు తీసుకోగలను’ అని తన తండ్రికి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
కోపంలో తండ్రి గదిలోకి వెళ్లి లైసెన్స్ ఉన్న తుపాకీని తీసుకొచ్చాడు. దీంతో బాలికపై తుపాకీ గురిపెట్టి కాల్చేసి.. పారిపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త, కుమార్తెను చూసి భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరువు పోతుందనే భయంతో తండ్రి చేసిన పనితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!