Komatireddy Venkat Reddy: రైతు భరోసాపై మంత్రి కీలక ప్రకటన..
- నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన
- కులగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది- మంత్రి కోమటిరెడ్డి
- త్వరలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది- మంత్రి
- త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నాము- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని చెప్పారు.
Read Also: Viral video : అమ్మాయిలతో పాటు భరతనాట్యం చేసిన ఏనుగు.. వీడియో వైరల్
Also Read
త్వరలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పాలనను ప్రధాని విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలకు సిలిండర్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాని చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం.. కానీ రాజకీయంగా కొట్లాడుతామని పేర్కొన్నారు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
జనవరి చివరి నాటికి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ టెండర్ ప్రక్రియ ముగుస్తుంది.. ట్రిపుల్ ఆర్ శంకుస్థాపనకు ప్రధానిని లేదా నితిన్ గడ్కరిని ఆహ్వానిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ శాసన సభ పక్ష నాయకుడు ఎవరో చెప్తే.. వాళ్లకే నేను సమాధానం చెప్తానన్నారు. కేసీఆర్ గురుకుల పాఠశాలలకు వస్తే ఆయనతో నేను కూడా కలిసి వెళ్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!