అమెరికాతో పాకిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు.
తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరికా ప్రకటించారు. దీంతో సంతాప కార్యక్రమానికి హాజరైన వారంతా స్టాండింగ్ ఒవేషన్ చేశారు. ఎరికా ప్రకటనను అందరూ స్వాగతించారు. చార్లీ కిర్క్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈవో కాంప్బెల్ విల్సన్ స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి సమస్య లేనట్లుగా తెలిపారు. ఇంజిన్లో గానీ.. స్విచ్ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదిలోపు బీహార్ ఎన్నికలు ముగియనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తు గురించి ఓపెన్గా మాట్లాడాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోవాలనే కోరిక లేనప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అశ్విన్ చెప్పాడు. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని అశ్విన్ అన్నాడు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. ఇంకా 6 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు…