NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- డ్యామ్ భద్రతలో నిర్లక్ష్యం.. వైరల్ వీడియోతో బట్టబయలు
- ఎన్టీవీ కథనంతో కదిలిన ఉన్నతాధికారులు
- 60 మంది సిబ్బందిపై ఏకకాలంలో చర్యలు
- భద్రత విషయంలో రాజీ లేదన్న కఠిన హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధుల్లో ఉండి, బాధ్యతలను విస్మరించి వినోదం కోసం చేపలు పట్టిన సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బందిపై వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన సంచలన కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. క్రమశిక్షణ తప్పిన 60 మంది సిబ్బందిని ఒక్కసారిగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల ప్రకారం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర చేపల వేటపై కఠినమైన నిషేధం ఉంది. అయితే, దేశ రక్షణ బాధ్యతల్లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సిఆర్పిఎఫ్ జవాన్, యూనిఫాంలోనే ఉండి కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న క్రస్ట్ గేట్ల వద్ద గాలం వేసి చేపలు పట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, ఎన్టీవీ ఈ భద్రతా లోపాన్ని ఎండగడుతూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ఎన్టీవీ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మొత్తం 60 మంది జవాన్లను నాగార్జున సాగర్ నుంచి విశాఖపట్నం బెటాలియన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్తగా మరో 60 మంది జవాన్లను డ్యామ్ భద్రత కోసం నియమించారు. కేవలం ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మొత్తం బృందంపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ఉద్రిక్తతలు , ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సాగర్ డ్యామ్ భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్గా ఉండాల్సిన చోట, ఇలా అత్యంత క్యాజువల్గా విధులను వదిలేసి చేపలు పట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్టీవీ కథనం ప్రభావంతో అధికారులు మేల్కొని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఈ బదిలీల ద్వారా గట్టి సందేశాన్ని పంపారు.
తాజావార్తలు
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!