NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- డ్యామ్ భద్రతలో నిర్లక్ష్యం.. వైరల్ వీడియోతో బట్టబయలు
- ఎన్టీవీ కథనంతో కదిలిన ఉన్నతాధికారులు
- 60 మంది సిబ్బందిపై ఏకకాలంలో చర్యలు
- భద్రత విషయంలో రాజీ లేదన్న కఠిన హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధుల్లో ఉండి, బాధ్యతలను విస్మరించి వినోదం కోసం చేపలు పట్టిన సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బందిపై వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన సంచలన కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. క్రమశిక్షణ తప్పిన 60 మంది సిబ్బందిని ఒక్కసారిగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల ప్రకారం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర చేపల వేటపై కఠినమైన నిషేధం ఉంది. అయితే, దేశ రక్షణ బాధ్యతల్లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సిఆర్పిఎఫ్ జవాన్, యూనిఫాంలోనే ఉండి కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న క్రస్ట్ గేట్ల వద్ద గాలం వేసి చేపలు పట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, ఎన్టీవీ ఈ భద్రతా లోపాన్ని ఎండగడుతూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఎన్టీవీ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మొత్తం 60 మంది జవాన్లను నాగార్జున సాగర్ నుంచి విశాఖపట్నం బెటాలియన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్తగా మరో 60 మంది జవాన్లను డ్యామ్ భద్రత కోసం నియమించారు. కేవలం ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మొత్తం బృందంపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ఉద్రిక్తతలు , ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సాగర్ డ్యామ్ భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్గా ఉండాల్సిన చోట, ఇలా అత్యంత క్యాజువల్గా విధులను వదిలేసి చేపలు పట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్టీవీ కథనం ప్రభావంతో అధికారులు మేల్కొని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఈ బదిలీల ద్వారా గట్టి సందేశాన్ని పంపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!