NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- డ్యామ్ భద్రతలో నిర్లక్ష్యం.. వైరల్ వీడియోతో బట్టబయలు
- ఎన్టీవీ కథనంతో కదిలిన ఉన్నతాధికారులు
- 60 మంది సిబ్బందిపై ఏకకాలంలో చర్యలు
- భద్రత విషయంలో రాజీ లేదన్న కఠిన హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధుల్లో ఉండి, బాధ్యతలను విస్మరించి వినోదం కోసం చేపలు పట్టిన సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బందిపై వేటు పడింది. ఈ వ్యవహారంపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన సంచలన కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. క్రమశిక్షణ తప్పిన 60 మంది సిబ్బందిని ఒక్కసారిగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల ప్రకారం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర చేపల వేటపై కఠినమైన నిషేధం ఉంది. అయితే, దేశ రక్షణ బాధ్యతల్లో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సిఆర్పిఎఫ్ జవాన్, యూనిఫాంలోనే ఉండి కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న క్రస్ట్ గేట్ల వద్ద గాలం వేసి చేపలు పట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, ఎన్టీవీ ఈ భద్రతా లోపాన్ని ఎండగడుతూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read
- PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
- TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
ఎన్టీవీ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మొత్తం 60 మంది జవాన్లను నాగార్జున సాగర్ నుంచి విశాఖపట్నం బెటాలియన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్తగా మరో 60 మంది జవాన్లను డ్యామ్ భద్రత కోసం నియమించారు. కేవలం ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మొత్తం బృందంపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ఉద్రిక్తతలు , ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సాగర్ డ్యామ్ భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్గా ఉండాల్సిన చోట, ఇలా అత్యంత క్యాజువల్గా విధులను వదిలేసి చేపలు పట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్టీవీ కథనం ప్రభావంతో అధికారులు మేల్కొని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఈ బదిలీల ద్వారా గట్టి సందేశాన్ని పంపారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?