Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- ప్రారంభం కానున్న సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం
- ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న జర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి ప్రేమికులకు.. పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య.. కృష్ణా నదిలో ప్రయాణించాలని ఎంత మంది కోరుకోరు. అయితే వారి కోసం.. నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించనుంది.
Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…
Also Read
అయితే ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి.. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రయాణికులు, భక్తులు కోసం.. ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని.. పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టూ శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం… పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా.. పిల్లలకు 2,600 రూపాయలు ధర ఫిక్స్ చేశారు. అయితే.. కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు 2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా నిర్ణయించింది టూరిజం డిపార్ట్మెంట్..
Read Also:Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్
అయితే.. లాంచీలో సాగర్ నుంచి … నంది కొండ మీదుగా ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అందాలను ఎంజాయ్ చేసేలా.. ఈ ప్రయాణం ఏర్పాటు చేసామని టూరిజం అధికారులు వెల్లడించారు. నదిలో 110 కిలోమీటర్ల దూరం.. ఆరుగంటల ప్రయాణం ఉంటుందని తెలిపారు. మధ్యలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పుకొచ్చారు. ఈనెల 22 నుంచి ప్రతి శనివారము టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభిస్తామని తెలిపారు. అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
-
Lavanya : అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు!
-
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
-
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!