Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది..
- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం
- హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తాం- బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది- బండి సంజయ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్కు ఎన్నికల్లో మద్ధతునిస్తున్నామని బీఆర్ఎస్ చెప్పిందని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ కార్ రేసుల్లో బీఆర్ఎస్ నేతలను జైలుకు వెళ్లకుండా ఒప్పందం చేసుకున్నారని బండి సంజయ్ తెలిపారు.
Read Also: Thandel : తండేల్ సక్సెస్ పై నాగార్జున రియాక్షన్.. సోషల్ మీడియాలో పోస్ట్
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
మరోవైపు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని బండి సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఏది అని.. యువత కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు.. పాఠశాలలో కనీస వసతులు లేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు తప్పుల తడక.. బీసీలు లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
Read Also: INDIA bloc: మేమంతా కలిసే ఉన్నాం, లోక్సభ ఎన్నికల్లో మళ్లీ వస్తాం..
ముస్లిమ్ మైనార్టీల ఓట్లతో స్థానిక సంస్థల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బండి సంజయ్ అన్నారు. బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు.. విద్యా వ్యవస్థ మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ కోరారు. ఈ 11 ఏళ్లలో తెలంగాణకు ఎంత బడ్జెట్ విడుదల చేసామో.. చర్చకు తాము సిద్ధమని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!