MP K.laxman : మోడీ వైపే దేశ ప్రజలు.. మరోసారి మూడు రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ వైపే దేశ ప్రజలు , మరోసారి మూడు రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయన్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా దేశ ప్రజానీకం మోడీ వెన్నంటే అన్నారు. 70 యేండ్లు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య రాష్ట్రాల తొలిసారి అభివృద్ధి రుచి చూస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. డబల్ ఇంజిన్ సర్కార్ కోసమే బీజేపీకి విజయాలు వస్తున్నాయన్నారు. మూడు రాష్ట్రాల ఫలితాలు దేశ వ్యాప్తంగా మోడీ సర్కారుకు ప్రజలు బ్రహ్మరథమ్ పట్టరాని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఇది అసంబద్ధ పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీలకు చెంపపెట్టు అని అన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇన్నేండ్లు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య రాష్ట్రాలు మోడీ సర్కారు వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలు బీజేపీ కి ఓటేస్తున్నారని అందుకే మోడీ గారికి, బీజేపీ కి మూడు రాష్ట్రాల ప్రజలు వెన్నంటి ఉన్నారన్నారు.
Also Read : Putin: పుతిన్ వైభోగం మామూలుగా లేదుగా.. రూ.990 కోట్ల ఎస్టేట్లో లవర్తో రహస్య జీవనం
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేవలం అధికారం కోసం పొత్తులు పెట్టుకున్నారని, ఆ పార్టీల కలయికను ప్రజలు తిప్పికొట్టారని డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు వామపక్ష తీవ్రవాదం, ఇతర తీవ్రవాదం వైపుకు బలవంతంగా నెట్టేయబడ్డ రాష్ట్రాల లో శాంతిని నెలకొల్పి ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నాగాలాండ్ లో మెజారిటీ క్రిస్టియన్ ప్రజలు ఉన్నా కూడా కేవలం అభివృద్ధి కోసమే ప్రజలు బీజేపీ ని ఆశీర్వదించారని అన్నారు. మేఘాలయ తో పాటు మూడు రాష్ట్రాలలో కూడా డబల్ ఇంజిన్ సర్కారు రావడం మంచి పరిణామం అని కొనియాడారు. నిరంతరం మోడీని దూషించే కేసీఆర్ వారి పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓటమికి సిద్ధంగా ఉండాలని, తెలంగాణ లో కూడా బీజేపీ పార్టీ డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Allu Arjun: అయ్యిందా.. బాగా అయ్యిందా.. అది రూమర్ అని తెలిసిందా..?
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
-
T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!