Sabitha indrareddy: ప్రశ్న పత్రాల లీకేజీ పై మంత్రి సబితా రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sabitha reaction on question paper leak: పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పై విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని తెలియజేసుకుంటున్నానని అన్నారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని మనవి చేసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Also Read
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ వాట్సాప్లో ప్రశ్నపత్రాలు రావడం సంచలనంగా మారింది. నిన్న వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి మరో వ్యక్తికి వాట్సాప్లో పంపాడు. ఈరోజు వరంగల్లో హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమైన ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. బయటకు వచ్చిన పేపర్ ఈరోజు కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. కానీ పేపర్ సీరియల్ నంబర్ కనిపించకుండా ఫొటో తీశారని తెలిపారు. ఆ పేపర్ ఎక్కడి నుంచి బయటపడిందో విచారణలో తెలుస్తుందన్నారు. అయితే ఇది లీకేజీ కాదని, పేపర్ బయటికి వచ్చిందన్నారు. సగం పరీక్ష ముగిశాక పేపర్ బయటకు వచ్చిందన్నారు.
Telangana Congress: కోమటిరెడ్డి పై హైకోర్టుకు చెరుకు సుధాకర్.. నేడే విచారణ
తాజావార్తలు
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?