KTR: అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే అన్నారు. కుటుంబ పెద్ద కేసీఅర్ అని కేటీఆర్ తెలిపారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తె అది కాంగ్రెస్ సర్కార్ నే అన్నా మంత్రి కేటీఆర్ మోడీ పనితీరు గురించి మాట్లాడాలని అన్నారు. ముప్పై ఏళ్ళలో అత్యంత ఎక్కువగా నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు. 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిలిండర్ ధర భారతదేశంలో ఉందని అన్నారు. పెట్రోల్ ధర కూడా భారత్ లో ఎక్కువ అన్నారు. తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయ.. ఏమైనా దొరుకుతుంది ఏమో చూస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Telangana Jobs: గుడ్ న్యూస్.. 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 పోస్టులు
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు. గుజరాత్లో పరిశ్రలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు అన్నారు. మేము రైతురాజ్యం కావాలంటే.. బీజేపీవాళ్లు కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరంటూ మండిపడ్డారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు ఆర్థికవేత్త లేరు అన్నారు మంత్రి. రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలన్నారు. యాద్రద్రి పవర్ ప్రాజెక్టు ను అడ్డుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుందని అన్నారు. PFC, REC లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వొద్దని బెదిరిస్తారని అన్నారు. తెలంగాణ పై కేంద్రం కు కక్ష్య చూపిస్తుందన్నారు. దక్షతతో మేము పని చేస్తుంటే…కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలను తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.
MLA Jaggareddy: నేను స్పీచ్ రాసుకుని వచ్చా.. ఆయన మాట్లాడితే మర్చిపోయా
తాజావార్తలు
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..