Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు
Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. అమలులో తెచ్చిన నోట్లు మళ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2000 నోట్ల రద్దుతో దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పెట్టుబడిదారుల రహస్య ఎజెండాలో భాగమే రద్దు అని విమర్శించారు. రూ.2000 నోట్లను రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ఎందుకు చేశారో తెలియదన్న ఆయన.. ఎంత నల్లధనం వెలికితీశారో తెలియదన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాదని, కొద్ది మంది కోసమేనని అన్నారు.
Read also: AC Side Effects: ఎండ ఎక్కువగా ఉందని ఏసీలో కూర్చుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
మోడీ మత విశ్వాసాలకు అతీతంగా ప్రజలను పేదరికంలో ఉంచే భూస్వామ్య భావజాలంలో నోట్ల రద్దు ఒక భాగమని మంత్రి మండిపడ్డారు. నోట్ల రద్దుతో లాభం ఉంటే ప్రచారం ఎందుకు లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో లేకుంటే గగ్గోలు పెట్టిన ఆర్థికమంత్రి మరి ఇప్పుడు రూ.2వేల నోట్లు రద్దుపై ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆర్థికమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పతనం వెనుక దాగి ఉన్న రహస్యం ఎజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విజృంభణ ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నాటకలో తాము లేకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!