Mynampally: మైనంపల్లి హనుమంత రావు నివాసంలో కాంగ్రెస్ కార్యర్తల సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mynampally: కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సందడి వాతావరణ నెలకొంది. మైనంపల్లి నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యర్తలు భారీగా చేరుకుని సందడి చేశారు. కుత్బుల్లాపూర్,మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి మైనం పల్లి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. మైనంపల్లికి కుత్బుల్లాపూర్ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అభినందించారు. మీ సేవలు మాకు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. మీ లాంటి సీనియర్లు కాంగ్రెస్ కు చాలా అవసరమని, మీసేవలు తెలంగాణ ప్రజలకు అవసరమని మైనంపల్లిని కోరారు. మైనంపల్లి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ రానున్న నేపథ్యంలో ఇంటివద్ద కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు. కొన్ని అపోహలు సృష్టించి రెండు నియోజక వర్గాల్లో (కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి) పోటీ చేస్తానని కొందరు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదని మైనంపల్లి కొట్టి పడేశారు. మల్కాజిగిరి నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని మైనం పల్లి హనుమంత్ రావు స్పష్టం చేశారు.
మైనం పల్లి రాజీనామా..
Also Read
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(శుక్రవారం) వీడియో రూపంలో పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. “నేను భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను నా నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ను తిరస్కరించాను. నా మద్దతుదారులు మరియు నియోజకవర్గాలతో చాలా చర్చలు మరియు సంప్రదింపుల తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరినప్పుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో GHMCలో ఒక్క కార్పొరేటర్ లేకుండా మల్కాజిగిరి లోక్సభ స్థానంలో ఎదురుగాలులు వీస్తున్నాయి.పార్టీ కోసం,ప్రజల కోసం కష్టపడ్డాను.గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2016 GHMC ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం కోసం.. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యానని తెలిపారు.. దాని పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదు. పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకాభిప్రాయం, సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. పార్టీ శ్రేణుల అధిష్టానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడమే ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో మీరు అందించిన సహకారం, మద్దతుకు ధన్యవాదాలు’ అని మైనంపల్లి హనుమంతరావు తన రాజీనామా లేఖలో రాశారు.
Rats Attack: పసికందుపై ఎలుకల గుంపు దాడి…ఎంత దారుణంగా కొరికేశాయంటే?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!