KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.
- హనుమకొండలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- బీసీ ద్రోహి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ విమర్శ
- కాంగ్రెస్ మోసపూరిత పాలనపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
- ఓరుగల్లు నుంచే ప్రభుత్వానికి ప్రతిఘటన మొదలవుతుందన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారినే మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, రేవంత్ రెడ్డిని బీసీ ద్రోహిగా వ్యాఖ్యానిస్తూ, ఆయన వ్యవహారం కొండంత రాగం తీసి గాడిద పాడినట్టుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ప్రజలను నమ్మించి తర్వాత మోసం చేసినట్టుగా ఉన్నాయని, అలాంటి పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. పార్టీతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్న తీరు అసంబద్ధంగా ఉందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటిగా వారి నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయని, త్వరలోనే ప్రజలు ఈ పాలనలో ఉన్న లోటులను స్పష్టంగా గమనిస్తారని భావించారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
పోకో నుండి సర్ప్రైజ్.. Poco Pad X1, Pad M1 గ్లోబల్గా లాంచ్.. ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..!
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్న కేటీఆర్, గాడిదలను చూస్తే గుర్రం విలువ తెలిసినట్టే ప్రజలు బీఆర్ఎస్ పాలన విలువను ఇప్పుడు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించేందుకు దీక్షాదివాస్ అవసరమని, కేసీఆర్ తెగువ, నిరాహార దీక్ష ఉద్యమాన్ని విజయానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు.
అవినీతి విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తన రాష్ట్రానికి అనకొండలా, చీడపురుగులా మారిందని ఆయన ఆరోపించారు. ఇటీవల జూబ్లీహిల్స్లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రిని గల్లీగల్లీ తిరిగేలా చేశామని అన్నారు. కాంగ్రెస్ ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమిదని, ఇటువంటి ద్రోహం ఎక్కువకాలం నిలవదని స్పష్టం చేశారు. ఓరుగల్లు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిఘటన మొదలవుతుందని, రాబోయే రెండేళ్లలో ఈ ప్రభుత్వంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!