KTR vs Bandi Sanjay : బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
- బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తవమని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ నేత
- డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టులో విచారణకు వెళ్లనున్న కేసు
- హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారన్న కేటీఆర్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR vs Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలతో నిండివున్నాయని, అవి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం కేటీఆర్ తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు డిసెంబర్ 15వ తేదీన విచారణ జరపనుంది. బండి సంజయ్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ బండి సంజయ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
- Drugs Busted: అత్తాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
తనపై చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని, ముఖ్యంగా తన ప్రజా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కోర్టులో స్పష్టం చేశారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణ. రాజకీయంగా పోటీ చేయడం వేరే విషయం, కానీ తప్పుడు ఆరోపణలతో ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం అసహ్యకరమని కేటీఆర్ వైఖరి.
బండి సంజయ్పై కేటీఆర్ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రతియారోపణలు మరోస్థాయికి చేరాయి. ఈ కేసు విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!
తాజావార్తలు
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!