KTR vs Bandi Sanjay : బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
- బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తవమని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ నేత
- డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టులో విచారణకు వెళ్లనున్న కేసు
- హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారన్న కేటీఆర్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR vs Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలతో నిండివున్నాయని, అవి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం కేటీఆర్ తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు డిసెంబర్ 15వ తేదీన విచారణ జరపనుంది. బండి సంజయ్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ బండి సంజయ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
తనపై చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని, ముఖ్యంగా తన ప్రజా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కోర్టులో స్పష్టం చేశారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణ. రాజకీయంగా పోటీ చేయడం వేరే విషయం, కానీ తప్పుడు ఆరోపణలతో ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం అసహ్యకరమని కేటీఆర్ వైఖరి.
బండి సంజయ్పై కేటీఆర్ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రతియారోపణలు మరోస్థాయికి చేరాయి. ఈ కేసు విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..