KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు
- కాంగ్రెస్-బీజేపీపై కేటీఆర్ ఫైర్
- కాంట్రాక్టులపై సంచలన ఆరోపణలు
- ‘ఆర్ఆర్ టాక్స్’పై ప్రశ్నలు
- చీకటి దోస్తీపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒకరి దోపిడీని మరొకరు బయటపెట్టకుండా పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న “ఇచ్చి-పుచ్చుకునే బంధం” స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వందల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అమృత్’లో కూడా ఆయనకే భారీగా టెండర్లు దక్కేలా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఎంపీలకు కూడా కాంట్రాక్టులు ఇస్తున్నారని, ఇలా ఒకరికొకరు లబ్ధి చేకూర్చుకుంటూ దోపిడీని సాగిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో చేసిన ‘ఆర్ఆర్ టాక్స్’ (రాహుల్-రేవంత్ టాక్స్) వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ఈ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని ఆయన నిలదీశారు. అవినీతి జరుగుతోందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీజేపీలు కేవలం ప్రజల కళ్లముందు మాత్రమే కొట్లాడుకుంటున్నాయని, కానీ అంతర్గతంగా మాత్రం బ్రహ్మాండమైన దోస్తీని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఒకరి అవినీతిని మరొకరు దాచిపెడుతూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని, ఈ “చీకటి దోస్తుల” వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు.
Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
తాజావార్తలు
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!