Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
- కొండా సురేఖపై వేటు
- చిన్నారెడ్డికి ఉద్వాసన
- అధిష్టానంపై సురేఖ ఫైర్
- కక్షసాధింపేనంటూ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని భావించడమే కాకుండా, ఆమె బర్తరఫ్ లేఖను గవర్నర్కు పంపినట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించగా, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కుడా (KUDA) చైర్పర్సన్గా మాజీ ఎంపీ గుండు సుధారాణిలను నియమించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరణ అడగకుండానే బర్తరఫ్ చేశారు: ఎన్టీవీతో కొండా సురేఖ
తన బర్తరఫ్ నిర్ణయంపై కొండా సురేఖ ఎన్టీవీ (NTV) తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వివరణ అడగకుండానే తనను పదవి నుంచి తొలగించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అన్ని విషయాలు వివరించినా తనను కావాలనే బలిచేశారని విమర్శించారు. రాజీనామా చేయమని తనను ఎవరూ అడగలేదని, తాను చేయలేదని స్పష్టం చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించిన ఆమె, అధిష్టానానికి తాను రాసిన లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు.
Also Read
టీడీపీ నేపథ్యం ఉన్నవారి కక్షపూరిత చర్య
ఈ నిర్ణయం వెనుక కక్షసాధింపు చర్యలు ఉన్నాయని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడి వద్ద ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయాలే చూశామని, సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చినవారే కాబట్టి వారికి ఇది అలవాటేనని విమర్శించారు. సుమంత్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఎపిసోడ్తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. యూట్యూబ్లలో ఇతర మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఆమె, సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు.
నన్ను టార్గెట్ చేసి చిన్నారెడ్డిని బలి చేశారు
తనను టార్గెట్ చేయడానికి చిన్నారెడ్డిని బలిచేశారని, 80 ఏళ్ల వయస్సున్న ఆయనపై చర్యలు తీసుకోవడం సరికాదని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన వల్ల ముగ్గురు మహిళలకు పదవులు లభించాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులకు తమ గురించి పూర్తిగా తెలుసని, తమను కాకుండా పార్టీనే తప్పుపడతారని ఆమె అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన వర్గీయులతో కూర్చుని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!