Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy Fires On CM KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని.. 9 ఏళ్ల క్రితం కల్వకుంట్ల కుటుంబ ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. మునుగోడులో కేసీఆర్ అడ్డదారిలో గెలిచారని, ఆయనపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపే చూస్తున్నారని.. ప్రధాని మోడీ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయొచ్చని వాళ్లు భావిస్తున్నారని తెలిపారు.
Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
Also Read
రాష్ట్రంలో నిజమైన కురక్షేత్రం ముందుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగడం బాధాకరమని అన్నారు. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూం వంటి పథకాలన్నీ కేవలం ఎన్నికల జిమ్మిక్కులేనని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఆ మాట తప్పారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా కేసీఆర్ సర్కార్ కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. అధికారం, డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంటే.. బీజేపీ వైపు ధర్మం, ప్రజాబలం ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో.. బీజేపీ అభ్యర్థులను గెలిపిచేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
అంతకుముందు కూడా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా మర్చిపోయారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే పెన్షన్లు, రైతుబంధు పథకాలను కేసీఆర్ సర్కార్ అందిస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీలో పేరులో తెలంగాణ పదం తీసి, బీఆర్ఎస్ పేరు పెట్టి.. తన గుంత తానే తీసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ తుగ్లక్ మాదిరిగా పరిపాలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. తెలంగాణ ప్రజలకు ఆయన ఏం న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!