Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy Fires On CM KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని.. 9 ఏళ్ల క్రితం కల్వకుంట్ల కుటుంబ ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. మునుగోడులో కేసీఆర్ అడ్డదారిలో గెలిచారని, ఆయనపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపే చూస్తున్నారని.. ప్రధాని మోడీ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయొచ్చని వాళ్లు భావిస్తున్నారని తెలిపారు.
Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
రాష్ట్రంలో నిజమైన కురక్షేత్రం ముందుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగడం బాధాకరమని అన్నారు. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూం వంటి పథకాలన్నీ కేవలం ఎన్నికల జిమ్మిక్కులేనని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఆ మాట తప్పారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా కేసీఆర్ సర్కార్ కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. అధికారం, డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంటే.. బీజేపీ వైపు ధర్మం, ప్రజాబలం ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో.. బీజేపీ అభ్యర్థులను గెలిపిచేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
అంతకుముందు కూడా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా మర్చిపోయారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే పెన్షన్లు, రైతుబంధు పథకాలను కేసీఆర్ సర్కార్ అందిస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీలో పేరులో తెలంగాణ పదం తీసి, బీఆర్ఎస్ పేరు పెట్టి.. తన గుంత తానే తీసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ తుగ్లక్ మాదిరిగా పరిపాలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. తెలంగాణ ప్రజలకు ఆయన ఏం న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!