Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy Fires On CM KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని.. 9 ఏళ్ల క్రితం కల్వకుంట్ల కుటుంబ ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. మునుగోడులో కేసీఆర్ అడ్డదారిలో గెలిచారని, ఆయనపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపే చూస్తున్నారని.. ప్రధాని మోడీ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయొచ్చని వాళ్లు భావిస్తున్నారని తెలిపారు.
Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
రాష్ట్రంలో నిజమైన కురక్షేత్రం ముందుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగడం బాధాకరమని అన్నారు. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూం వంటి పథకాలన్నీ కేవలం ఎన్నికల జిమ్మిక్కులేనని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఆ మాట తప్పారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా కేసీఆర్ సర్కార్ కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. అధికారం, డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంటే.. బీజేపీ వైపు ధర్మం, ప్రజాబలం ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో.. బీజేపీ అభ్యర్థులను గెలిపిచేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
అంతకుముందు కూడా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా మర్చిపోయారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే పెన్షన్లు, రైతుబంధు పథకాలను కేసీఆర్ సర్కార్ అందిస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీలో పేరులో తెలంగాణ పదం తీసి, బీఆర్ఎస్ పేరు పెట్టి.. తన గుంత తానే తీసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ తుగ్లక్ మాదిరిగా పరిపాలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. తెలంగాణ ప్రజలకు ఆయన ఏం న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!