Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Draw Lottery Fraud In Nizamabad: మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలీచాలని జీతంతో కుటుంబం బాధ్యతలు మోస్తూ.. చాలా కష్టంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్లందరూ తమ తలరాతను మార్చే అదృష్ట ఘడియల కోసం ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు. వాళ్ల ఈ అవసరాన్నే కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని నిండా దోచేసి, డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు కూడా అలాంటి మోసానికే పాల్పడ్డాడు. మధ్య తరగతి వారిని టార్గెట్ చేసి, లక్కీ డ్రా ఆశ చూపి, ఏకంగా రూ. 72 లక్షలు దోచేసుకున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రెండేళ్లు గడిచినా, పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
కొన్నేళ్ల క్రితం ఫిరోజ్ అనే వ్యక్తి షైన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థని ప్రారంభించాడు. ఇది ఒక లక్కీ డ్రా అని, నెలకు రూ.1000 చొప్పున డబ్బులు కడితే.. లక్కీ డ్రా వచ్చిన వాళ్లు భారీ డబ్బులు అందుకోవచ్చని ఆశ చూపించాడు. ఇదేదో బాగుంది కదా అని మధ్య తరగతి వారు అతడు చెప్పినట్టుగానే నెలకు రూ.1000 చొప్పున కట్టారు. ఇలా మొత్తం 350 మంది 20 నెలల పాటు లక్కీ లాటరీకి డబ్బులు కట్టారు. ఈ విధంగా అందరి వద్ద నుంచి రూ.72 లక్షలకు పైగా డబ్బులను వసూలు చేశాడు. సరైన సమయం కోసం వేచి చూసిన ఫిరోజ్.. అందరికీ శఠగోపం తొడిగించి, ఆ డబ్బులతో ఉడాయించాడు. ఎక్కడా అతని జాడ కనిపించకపోవడం, ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో.. ఫిరోజ్ తమని మోసం చేశాడని బాధితులు గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో ఇతని బాధితులు ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి న్యాయం చేయాలని వీళ్లు పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో, బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!