Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Draw Lottery Fraud In Nizamabad: మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలీచాలని జీతంతో కుటుంబం బాధ్యతలు మోస్తూ.. చాలా కష్టంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్లందరూ తమ తలరాతను మార్చే అదృష్ట ఘడియల కోసం ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు. వాళ్ల ఈ అవసరాన్నే కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని నిండా దోచేసి, డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు కూడా అలాంటి మోసానికే పాల్పడ్డాడు. మధ్య తరగతి వారిని టార్గెట్ చేసి, లక్కీ డ్రా ఆశ చూపి, ఏకంగా రూ. 72 లక్షలు దోచేసుకున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రెండేళ్లు గడిచినా, పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
కొన్నేళ్ల క్రితం ఫిరోజ్ అనే వ్యక్తి షైన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థని ప్రారంభించాడు. ఇది ఒక లక్కీ డ్రా అని, నెలకు రూ.1000 చొప్పున డబ్బులు కడితే.. లక్కీ డ్రా వచ్చిన వాళ్లు భారీ డబ్బులు అందుకోవచ్చని ఆశ చూపించాడు. ఇదేదో బాగుంది కదా అని మధ్య తరగతి వారు అతడు చెప్పినట్టుగానే నెలకు రూ.1000 చొప్పున కట్టారు. ఇలా మొత్తం 350 మంది 20 నెలల పాటు లక్కీ లాటరీకి డబ్బులు కట్టారు. ఈ విధంగా అందరి వద్ద నుంచి రూ.72 లక్షలకు పైగా డబ్బులను వసూలు చేశాడు. సరైన సమయం కోసం వేచి చూసిన ఫిరోజ్.. అందరికీ శఠగోపం తొడిగించి, ఆ డబ్బులతో ఉడాయించాడు. ఎక్కడా అతని జాడ కనిపించకపోవడం, ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో.. ఫిరోజ్ తమని మోసం చేశాడని బాధితులు గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో ఇతని బాధితులు ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి న్యాయం చేయాలని వీళ్లు పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో, బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!