Deputy CM Bhatti: దేశంలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తున్నాం..
- అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష..
- దేశంలో ఎక్కడ లేని విధంగా రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు..
- రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Bhatti: అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంఛార్జ్ మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందజలో ఉంది.. వారం రోజుల్లో నగదు కూడా వారి అకౌంట్ కి వేశాం.. గతంలో 2, 3 నెలలు అయిన నగదు వేసేవారు కాదు అని ఆరోపించారు. దీనికి అధికారులకు అభినందనలు.. అలాగే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి.. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలతో ఇళ్లు శాంక్షన్ చేశాం.. నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం గొప్ప విషయం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మంత్రి కసరత్తు చేస్తున్నారు.. 4 లక్షల 56 వేల ఇళ్లకు నిర్మాణాలు చేపడుతున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. గాయపడిన వృద్ధురాలిని..!
Also Read
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
అలాగే, సీజన్ మొదలైంది కాబట్టి విత్తనాల పంపిణీ మంచిగా జరగాలి.. నకిలీ విత్తనాలు అమ్మేవారికి జిల్లాలో పుట్టగతులు ఉండవు అని ఉప ముఖ్యమంత్రి భట్టి వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ఇక, ధరణి పోర్టల్ ను పదేళ్లు చూశాం.. ధరణిలో బంధించిన వాటిని బయటకు తీసుకుని వచ్చేది, ప్రజలకు సరళమైన, న్యాయమైన హక్కులన్నింటినీ కాల రాసిన చట్టం ధరణి అని ఆరోపించారు. ధరణినీ తొలగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం, దానికి తగ్గట్టుగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కసరత్తు చేశారు.. అందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం పేదలకు అనుకూలంగా ఇది పని చేస్తుందని డిప్యూటీ సీఎం విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!
ఇక, తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి అన్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి.. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి లిస్ట్ మొత్తం ఇంఛార్జ్ మంత్రికి అప్పగించాలి అని సూచించారు. అధికారులు ఎక్కడ కూడా ఉదాసీనత వ్యక్త పర్చొద్దు.. గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని విభాగాలను గాలికి వదిలి వేసింది.. బడ్జెట్ పరంగా ఏ ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిగా నిధులు విడుదల చేస్తామన్నారు. సీజన్ వ్యాధులకు సంబంధించి కలెక్టర్లు సీరియస్ గా పని చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!