Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- రూ.10 లక్షలకు రూ.40 లక్షలు అంటూ మోసం
- యూనిఫామ్, హ్యాండ్కఫ్లతో నకిలీ దాడులు
- 12 మంది అరెస్ట్.. రూ.17.6 లక్షలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Police : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో జరిగిన సంచలన డెకాయిటీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని సత్తుపల్లి పోలీస్ ప్రత్యేక బృందాలు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈ దోపిడీ ముఠాలో భాగస్వాములు కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
సంచలనం రేపిన అసలు పోలీసుల నిర్వాకం
ఈ దోపిడీ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ ముళ్ళగిరి వర్దన్, అలాగే ఆర్ఎస్ఐ ఋశీ బేరా కేశవరావు ప్రధాన సూత్రధారులుగా ఉండటం గమనార్హం. యూనిఫామ్ వేసుకుని రక్షణగా నిలవాల్సిన వీరు నేరస్తులతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ ఈ ముఠా అమాయకులను వలలో వేసుకునేది. కేవలం రూ. 10 లక్షలు ఇస్తే దానికి బదులుగా రూ. 40 లక్షలు ఇస్తామంటూ బాధితులకు పెద్ద ఎత్తున ఆశ చూపించి బురిడీ కొట్టించేవారు.
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
పోలీస్ యూనిఫాంలో పక్కా ప్లాన్ ప్రకారం దాడి
నగదు మార్పిడి ఆశతో బాధితులు తమ వద్ద ఉన్న అసలు సొమ్ముతో ఒక ప్రాంతానికి రాగానే ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగేది. నిందితుల్లో కొందరు పోలీస్ యూనిఫాంలు, పోలీస్ టీషర్టులు, రైన్కోట్లు ధరించి, చేతిలో హ్యాండ్కఫ్లతో వచ్చి నకిలీ పోలీసుల తరహాలో బాధితులపై దాడి చేసేవారు. చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ తీవ్రంగా బెదిరింపులకు గురిచేసి, బాధితుల వద్ద ఉన్న అసలు నగదును దోచుకుని తమ వాహనాల్లో పరారయ్యేవారు. నమ్మకం కలిగించడం కోసం వీరు పిల్లలు ఆడుకునే డమ్మీ 500 రూపాయల కరెన్సీ నోట్లను బండిళ్లుగా కట్టి వాడుకునేవారు.
భారీగా సొత్తు స్వాధీనం – ముమ్మర దర్యాప్తు
సత్తుపల్లి ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో రూ. 17.60 లక్షల అసలు నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీని సీజ్ చేశారు. వీటితో పాటు 16 సెల్ఫోన్లు, దోపిడీకి వాడిన పోలీస్ యూనిఫాంలు, హ్యాండ్కఫ్లు, రైన్కోట్లు , రూ. 500 డమ్మీ కరెన్సీ నోట్లకు సంబంధించిన 80 బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంగారం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశామని, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!