Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- రూ.10 లక్షలకు రూ.40 లక్షలు అంటూ మోసం
- యూనిఫామ్, హ్యాండ్కఫ్లతో నకిలీ దాడులు
- 12 మంది అరెస్ట్.. రూ.17.6 లక్షలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Police : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో జరిగిన సంచలన డెకాయిటీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని సత్తుపల్లి పోలీస్ ప్రత్యేక బృందాలు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈ దోపిడీ ముఠాలో భాగస్వాములు కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
సంచలనం రేపిన అసలు పోలీసుల నిర్వాకం
ఈ దోపిడీ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ ముళ్ళగిరి వర్దన్, అలాగే ఆర్ఎస్ఐ ఋశీ బేరా కేశవరావు ప్రధాన సూత్రధారులుగా ఉండటం గమనార్హం. యూనిఫామ్ వేసుకుని రక్షణగా నిలవాల్సిన వీరు నేరస్తులతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ ఈ ముఠా అమాయకులను వలలో వేసుకునేది. కేవలం రూ. 10 లక్షలు ఇస్తే దానికి బదులుగా రూ. 40 లక్షలు ఇస్తామంటూ బాధితులకు పెద్ద ఎత్తున ఆశ చూపించి బురిడీ కొట్టించేవారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
పోలీస్ యూనిఫాంలో పక్కా ప్లాన్ ప్రకారం దాడి
నగదు మార్పిడి ఆశతో బాధితులు తమ వద్ద ఉన్న అసలు సొమ్ముతో ఒక ప్రాంతానికి రాగానే ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగేది. నిందితుల్లో కొందరు పోలీస్ యూనిఫాంలు, పోలీస్ టీషర్టులు, రైన్కోట్లు ధరించి, చేతిలో హ్యాండ్కఫ్లతో వచ్చి నకిలీ పోలీసుల తరహాలో బాధితులపై దాడి చేసేవారు. చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ తీవ్రంగా బెదిరింపులకు గురిచేసి, బాధితుల వద్ద ఉన్న అసలు నగదును దోచుకుని తమ వాహనాల్లో పరారయ్యేవారు. నమ్మకం కలిగించడం కోసం వీరు పిల్లలు ఆడుకునే డమ్మీ 500 రూపాయల కరెన్సీ నోట్లను బండిళ్లుగా కట్టి వాడుకునేవారు.
భారీగా సొత్తు స్వాధీనం – ముమ్మర దర్యాప్తు
సత్తుపల్లి ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో రూ. 17.60 లక్షల అసలు నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీని సీజ్ చేశారు. వీటితో పాటు 16 సెల్ఫోన్లు, దోపిడీకి వాడిన పోలీస్ యూనిఫాంలు, హ్యాండ్కఫ్లు, రైన్కోట్లు , రూ. 500 డమ్మీ కరెన్సీ నోట్లకు సంబంధించిన 80 బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంగారం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశామని, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!