Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ration Shops Open Even On Sundays In Ap Said Minister Nadendla Manohar

Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!

Published Date :May 29, 2025 , 2:19 pm
By Sampath Kumar
  • 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో రేషన్ షాపులు
  • రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం
  • రేషన్ షాపుల్లో తక్కువ ధరకే సరుకులు అందిస్తాం
  • ఈకేవైసీ 96 శాతం పూర్తి చేశాం
Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అని, రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్‌లో ధరల పెరుగుదల ఉంటే.. సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పని చేస్తాయని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.

జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుతం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ మధురానగర్‌లోని 218 రేషన్ షాపులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పని తీరును దగ్గరుండి మరీ చెక్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ‘జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. 29,760 షాపుల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పేరుతో మాయ చేసింది. వేల‌ కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం. రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈకేవైసీ 96 శాతం పూర్తి చేశాం.. దేశంలోనే ఇది ఒక రికార్డు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయి’ అని చెప్పారు.

Also Read: Vidadala Rajini: చంద్రబాబు.. ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు!

‘కోటి 46 లక్షల రేషన్ కార్డులు ఏపీలో ఉన్నాయి. జూన్ ఒకటి నుంచి 4.40 లక్షల మందికి సరుకులు ఇస్తున్నాం. మార్కెట్‌లో ధరలు పెరుగుదల ఉంటే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తాం. ప్రతి రేషన్ షాపు ఫొటో తీసి యాప్ ద్వారా ఆన్ లైన్లో ఉంచాం. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరుతాయి. ఈపోస్ మిషన్, కాటా, సర్వీసింగ్ ఉచితంగా చేయిస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించాం. 218 షాపు డీలర్ పసుపులేటి శివప్రసాద్ ముప్పై యేళ్లుగా డీలర్‌గా ఉన్నారు. వృద్దులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తాం. అన్ని విధాలా డీలర్లను కూడా ఇందుకు సన్నద్ధం చేశాం. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పని చేస్తాయి. ఎండియూలు పది శాతం డబ్బులు కట్టారు. మిగతా డబ్బు కార్పొరేషన్ ద్వారా కట్టి.. వాహనాలు వారికే ఇస్తున్నాం. ప్రజలు కూడా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలని కోరుతున్నారు. 15 రోజుల్లో వారికి వీలున్న సమయాల్లో సరుకులు తెచ్చుకుంటారు. 29,760 రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ ఉంటుంది. మార్కెట్లో పెరిగే వస్తువులను బట్టి.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం’ అని మంత్రి నాదెండ్ల తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • AP Ration
  • AP Ration Card
  • nadendla manohar
  • Ration shops

తాజావార్తలు

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

  • Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions