Medipalli Satyam: అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు. 10 ఏళ్లలో 30 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. గత ఏడాది అకాల వర్షాలతో చొప్పదండి నియోజక వర్గంలో పంటలు దెబ్బతింటే కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ కి కేసీఆర్ వచ్చి ఎకరానికి 10 వేల చొప్పున హైదరాబాద్ వెళ్ళే లోపు ఇస్తా అని చెప్పాడు, ఒక్క రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు.
Read Also: Delhi High Court: భర్త తప్పులేకుండా పదేపదే భార్య అత్తింటి నుంచి వెళ్లిపోవడం క్రూరత్వమే..
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ వస్తున్నాడని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. మిడ్ మానేరు నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు. రాజన్న గుడి సాక్షిగా 5 లక్షల 4 వేలు ఇస్తా అన్నావ్ ఇవ్వలేదని తెలిపారు. విత్తనాల రాయితీ, ఎరువుల మీద రాయితీ లేకుండా చేశావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను స్వేచ్చగా తిరిగే హక్కు కల్పించాడు.. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ లు, నిర్బంధాలు చేశాడని మండిపడ్డారు. తాము ఆహ్వానం పలుకుతున్నాం, రైతులకు క్షమాపణ చెప్పాలని కోరారు. నీవు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు బి ఫామ్ ఇస్తే వద్దు అంటున్నారని.. ప్రతిపక్ష హోదాలో బుద్ధిగా పని చెయ్ అని పేర్కొన్నారు. కేసీఆర్ యాత్రను రైతులు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
Read Also: Kavitha: సీబీఐ విచారణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!