Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర…
తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో తల్లిదండ్రులే కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేశారు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురి హత్యను ఆత్మహత్యగా చిత్రికరించి.. చివరకు పోలీసులకు చిక్కారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెల 14న జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన…
అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు…
Kavitha : కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్…
CM Revanth Reddy : మొంథా తుఫాన్ తెలంగాణ మీద భారీ ప్రభావం చూపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ భారీ వానలు పడుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సీఎం రేవంత్…
ఆ ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తూతూ మంత్రమేనా? పైకి ఎన్నిక అని చెబుతున్నా… మంత్రులు మాత్రం ఎంపిక చేసేసి మమ అనిపించే ప్లాన్లో ఉన్నారా? పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా… పెత్తనం మాత్రం మంత్రులదేనా? చెంబులో నీళ్ళు శంఖంలో పోస్తే తీర్ధం అయినట్టు తమ మనసులో ఉన్న పేర్లను పరిశీలన కమిటీతో చెప్పించబోతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల…
అసలే గోరుచుట్టు… ఆపై రోకటి పోటు అన్నట్టుగా మారింది అక్కడ అధికార పార్టీ వ్యవహారం. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పరువు బజారుకెక్కింది.డీసీసీ అధ్యక్ష ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరికి సీఎం రేవంత్రెడ్డి ఓకే చెప్పిన నాయకుడు కూడా… నాకేది గ్యారంటీ అని ఎందుకు మొత్తుకోవాల్సి వచ్చింది? సమన్వయ పరచాల్సిన మంత్రుల మధ్యనే సమన్వయం లేదా? ఎక్కడుందా పరిస్థితి? కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపాయి. జిల్లా అధ్యక్ష పదవికి,…
Pamela Satpathy: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి చేసిన ప్రత్యేక ప్రయత్నం మహిళలలో, సామాజిక వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. భ్రూణ హత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఆమె ఒక ప్రత్యేక పాట ఆలపించారు. ఆ పాట పేరు ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’, దీన్ని హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాసినది. తెలుగు అనువాదం నంది శ్రీనివాస్ చేసి, కలెక్టర్ సత్పతి స్వయంగా ఆలపించారు. ఈ…
Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి…