Kavitha: సీబీఐ విచారణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం అనేది ఇన్వెస్టిగేష్న్లో ఒక భాగమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తీహార్ జైల్లో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై జేడీ లక్ష్మీనారాయణ ఎన్టీవీతో మాట్లాడారు. కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టే సీబీఐ ఫర్మిషన్ తీసుకుందని తెలిపారు. కవితను విచారించాక తర్వాత ఏం చేయాలన్నదానిపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కవిత నుంచి సరైన ఆన్సర్ వస్తే ఇబ్బంది లేదు గానీ.. రాకుంటే మాత్రం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆలెడ్రీ ఈడీ నుంచి కూడా సీబీఐ కొంత సమాచారం తీసుకునే ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకే కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా సమాచారాన్ని షేర్ చేసుకుంటారని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అప్రూవర్లు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదని.. తగిన ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కాకపోతే అప్రూవర్లకు బెయిల్ దొరుకుతుందని వివరించారు. అప్రూవర్ల సమాచారానికి తగిన ఆధారాలు ఉండాల్సిందేనని.. వాళ్లిచ్చిన సమాచారంతోనే కేసులు కూడా నడవవన్నారు. కచ్చితంగా కొన్ని సాక్ష్యాలనైతే కలెక్ట్ చేయాల్సి ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్

ఇక దర్యాప్తు సంస్థలు ఏం కోరుకుంటాయో ఆ విధంగా న్యాయస్థానాలు కూడా సహకరిస్తుంటాయని చెప్పుకొచ్చారు. కోర్టులు ఎప్పుడు విచారణ విషయంలో జోక్యం చేసుకోవన్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. వాస్తనానికి ఇన్వెస్టిగేష్న్ సంస్థలకు కోర్టులు సహకరిస్తూ ఉంటాయని స్పష్టం చేశారు. ఇక దర్యాప్తు పూర్తయ్యాకే ఎవరికైనా బెయిల్ వస్తుందన్నారు. అటు తర్వాత దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం రుజువు అయితేనే నిందితులకు శిక్ష పడుతుందని.. లేదంటే విడిచిపెట్టేస్తాయన్నారు. దర్యాప్తు సంస్థల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయన్న సంగతి మాత్రం ఇప్పుడు తెలియదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!