Jubilee Hills Nominations : ఈరోజు ఒక్కరోజే 31 మంది నామినేషన్లు
- ఒక్కరోజే 31 మంది నామినేషన్లు
- పెరుగుతున్న పోటీ ఉత్సాహం
- BRS తరఫున విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్
- బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున భార్య హరిత నామినేషన్
- నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం. భారత రాష్ట్ర సమితి (BRS) తరఫున పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన అభ్యర్థి తరపున నామినేషన్ వేసిన ఆయన, పార్టీ తరఫున అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. మరోవైపు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య హరిత నామినేషన్ దాఖలు చేశారు. దీపక్ రెడ్డి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ వర్గాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ సారి రేసులో ఉన్నారు. చివరి రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. రేపు (ఆదివారం) సెలవు, ఎల్లుండి (సోమవారం) దీపావళి పండుగ కారణంగా.. మంగళవారం రోజే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే చివరి అవకాశం. ఈ నేపథ్యంలో చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అధికం కావడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!