Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..
- దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్న దేశం..
- హిమాచల్లోని ఓ గ్రామం మాత్రం దీపావళికి దూరం..
- గ్రామాన్ని వెంటాడుతున్న శతాబ్ధాల శాపం..
- సతీ శాపం కారణంగా ఇప్పటికీ పండగ జరుపుకోని గ్రామస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali: దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ‘‘దీపావళి’’ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీపావళికి సంబంధించి కొత్త బట్టలు, టపాసులు, ఇతరత్రా షాపింగ్ జోరుగా సాగుతోంది. తమ కుటుంబాలతో ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో వందల ఏళ్లుగా పండగను జరుపుకోవడం లేదు. దీనంతటికి ఓ ‘‘సతి’’ శాపమే కారణం. ఒక మహిళన తన భర్త చితిలో దూకి నిప్పటించుకుని మరణిస్తూ, శపించినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రజలు దీపావళిని జరుపుకోవడం లేదు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న సమ్మూలోని చిన్నగా దీపాలను వెలిగించవచ్చు, కానీ పటాకులు కాల్చడం, పండగ చేసుకోవడంపై నిషేధం ఉంది.
Also Read
- Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
- Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
Read Also: Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
కట్టుబాటును కాదని ఎవరైనా పండగ జరుపుకునేందుకు ప్రయత్నించిన సమయంలో, గ్రామంలో ఏదో ఒక చెడు జరగడం, ఎవరో ఒకరు చనిపోవడం వంటివి జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ శాపం తొలగడం కోసం అనేక పూజలు, హవనాలు, యజ్ఞాలు చేశారు. 3 ఏళ్ల క్రితం పెద్దగా యజ్ఞం కూడా చేశారు.అయినా కూడా శాపం ఎఫెక్ట్ ఇంకా ఉంది అని గ్రామస్తులు చెబుతునున్నారు. పండగ రోజు కొందరు ఇళ్ల నుంచి కూడా బయటకు రారు.
శాపం ఎలా వచ్చింది..?
గ్రామస్తుల ప్రకారం, వందల ఏళ్ల క్రితం, ఒక గర్భిణీ స్త్రీ దీపావళి జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, స్థానిక రాజు సైన్యంలో ఉన్న ఆమె భర్త చనిపోయి, అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భర్త మరణంతో తీవ్ర బాధలో ఉన్న ఆమె, భర్త చితిలో దూకి మరణించింది. ఆమె చనిపోయే ముందు, ఒక శాపాన్ని పెట్టింది. గ్రామ ప్రజలు ఎప్పటికీ దీపావళి జరుపుకోరని శపించింది. వారు ఆ రోజు జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఎవరైనా చనిపోతారు లేదా గ్రామంలో ఏదైనా విపత్తు సంభవిస్తుందని ఆ గ్రామంలో వృద్ధడైన ఠాకూర్ బిధి చంద్ అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
-
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
-
Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..