తెలంగాణ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్ధండ పిండం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఇమేజ్కే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పార్టీకి ఉండాల్సిన అసలైన గుర్తింపును రేవంత్ లాగేసుకున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదు, కేవలం రేవంత్ హవా మాత్రమే కనిపిస్తోంది” అని ఆయన మండిపడ్డారు. పార్టీలో తాను తీవ్రమైన అసంతృప్తికి, ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
ICC: టెస్ట్ క్రికెట్కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అలుపెరగని పోరాటం చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీ గూటికి చేరడం వెనుక ఉన్న బలమైన కారణాన్ని వివరించారు. “బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైన అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ఇస్తుందని ప్రజలతో పాటు నేనూ ఆశించాను. కానీ రేవంత్ రెడ్డి పాలనను ప్రత్యక్షంగా చూశాక, గత కేసీఆర్ ప్రభుత్వమే ఎంతో మేలు అనే అభిప్రాయానికి వచ్చాను. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి” అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఉన్న స్పష్టత, అనుభవం ఇప్పుడు లోపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయంపై జగిత్యాల ప్రజల స్పందన ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. కేవలం తాను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరే విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్ , పార్టీ హైకమాండ్ నిర్ణయానికి లోబడి ఉంటానని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక అగ్రనేత, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్లో చేరడం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.