Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!
- రసాయనాలతో పండించిన మామిడి పండ్ల ముప్పు
- నీటి పరీక్షతో అసలు-నకిలీ ఎలా గుర్తించాలి?
- రంగు, ఆకృతి, వాసనలో కనిపించే తేడాలు
- ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తారు. అయితే, లాభాల కోసం కొంతమంది వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇటువంటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో, మనం కొనే పండ్లు సహజంగా పండినవో కాదో గుర్తించడానికి FSSAI కొన్ని సులభమైన మార్గాలను సూచించింది.
Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్పై దర్శకుడు బాబీ ఎమోషనల్..
Also Read
- Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
- Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
నీటి పరీక్షతో నిజాన్ని తెలుసుకోండి
మామిడి పండ్లను గుర్తించడానికి ‘నీటి పరీక్ష’ అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఒక బకెట్ నిండా నీటిని తీసుకుని, మీరు కొన్న మామిడి పండ్లను అందులో వేయండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉంటాయి, కాబట్టి అవి నీటిలో పూర్తిగా మునుగుతాయి. ఒకవేళ పండ్లు నీటిపై తేలుతుంటే, అవి రసాయనాలతో పండించినవని అర్థం చేసుకోవాలి. రసాయనాల వల్ల పండులోని సహజమైన సాంద్రత తగ్గి, అవి తేలికగా మారి నీటిపై తేలుతాయి.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కలకలం.. నకిలీ పత్రాలతో అర్చక ఉద్యోగానికి యత్నం!
రంగు , ఆకృతిలో తేడాలు
చూడగానే ఆకర్షణీయంగా, ఎలాంటి మచ్చలు లేకుండా పూర్తిగా పసుపు రంగులో మెరిసిపోయే మామిడి పండ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రసాయనాలతో పండించిన పండ్లు రంగు అసమానంగా ఉంటుంది.. కొన్ని చోట్ల పసుపుగా, మరికొన్ని చోట్ల ముదురు ఆకుపచ్చగా కనిపిస్తాయి. సహజంగా పండిన పండులో పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసిపోయి ఉంటాయి. అలాగే, కృత్రిమంగా పండించిన పండును నొక్కి చూస్తే పైన మెత్తగా ఉన్నా, లోపల మాత్రం గట్టిగా ఉంటుంది. అదే సహజంగా పండిన పండు లోపల, పైన సమానంగా మెత్తగా ఉంటుంది.
రుచి , సువాసన
సహజంగా పండిన మామిడి పండును ముక్కు దగ్గర పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. రసాయనాలతో పండించిన పండ్లకు అస్సలు వాసన ఉండదు లేదా ఘాటైన రసాయన వాసన వస్తుంది. రుచి విషయానికి వస్తే, కృత్రిమ పండ్లు తిన్నప్పుడు నోటిలో లేదా గొంతులో స్వల్పంగా మంటగా అనిపిస్తుంది. అంతేకాకుండా, సహజంగా పండిన పండును కోసినప్పుడు మంచి రసం (Juice) వస్తుంది, కానీ రసాయన పండ్లలో రసం తక్కువగా ఉండి గుజ్జు ఎండిపోయినట్లుగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే తినకూడదు. కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత బాగా కడిగి వాడటం వల్ల పైన ఉన్న రసాయనాల ప్రభావం తగ్గుతుంది. పండ్ల సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నమ్మకమైన విక్రేతలు లేదా ఆర్గానిక్ స్టోర్స్ నుండి పండ్లను కొనడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!