Hezbollah Chief: ఇరాన్కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Chief: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసీమ్ మృతి చెందారు. తమ దాడుల్లో నయీం ఖాసీమ్ మృతిచెందినట్లు ఇజ్రాయెల్అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసీమ్ కార్యదర్శి, మేనల్లుడు అయిన అలీ యూసుఫ్ హర్షీని కూడా హతమార్చినట్లు పేర్కొంటూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటన విడుదల చేశాయి. IDF దళాలు లెబనీస్ రాజధాని బీరుట్లో నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
READ ALSO: Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..
Also Read
లెబనాన్లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలపై బుధవారం రాత్రి వరుస దాడులు నిర్వహించినట్లు IDF పేర్కొంది. ఈ ఆపరేషన్ల ముఖ్య ఉద్దేశ్యం, ఆ ఉగ్రవాద సంస్థ యొక్క కమాండ్ నెట్వర్క్ను పూర్తిగా దెబ్బతీయడం, దాని ఆయుధ సరఫరా మార్గాలను పూర్తిగా నిలిపివేయడం అని పేర్కొంది. బుధవారం రాత్రి బీరూట్లోని ఒక ప్రాంతంలో ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) వైమానిక దాడి జరిపినట్లు ఆ సంస్థ ప్రకటించింది . ఈ దాడిలో హిజ్బుల్లా అధిపతి, ఆయన కార్యదర్శి అలీ యూసఫ్ హెర్షి మరణించారు. IDF ప్రకారం.. ఈ ఇద్దరు అగ్ర నాయకుల మరణం హిజ్బుల్లా నాయకత్వ వ్యవస్థకు గణనీయమైన దెబ్బగా అభిప్రాయపడ్డారు. ఈ దాడి బీరూట్లోని ఆ బృందం యొక్క కీలక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో జరిగింది.
రాత్రి సమయంలో లిటాని నది మీదుగా ఉత్తరం నుంచి దక్షిణానికి రాకపోకల కోసం ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్లను కూడా ఐడిఎఫ్ ధ్వంసం చేసింది. ఈ మార్గాలను హిజ్బుల్లా కమాండర్లను, వేలాది ఆయుధాలను, రాకెట్లను, లాంచర్లను తరలించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ చర్య హిజ్బుల్లా పోరాట సామర్థ్యం, లాజిస్టిక్స్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని సమాచారం. దక్షిణ లెబనాన్లోని సుమారు 10 హిజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ పేర్కొంది . రాకెట్ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యే వరకు ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!