Minister Ponguleti: కాంగ్రెస్ని విలన్గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..
- కేసీఆర్ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం..
- కానీ, కేసీఆర్ మనసంతా విషం నింపుకున్నారు..
- కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరించే పనిలో ఉన్నారు..
- కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది: మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నీ విలన్ గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని ప్రశ్నించారు. కడుపులో విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడారు.. కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Motorola Edge 60 Pro: ఇట్స్ అఫీషియల్.. భారత్లో విడుదల కానున్న మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
ఇక, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కూడా రాలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం లేదు అని ఎద్దేవా చేశారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా.. రైతులను వరి వేసుకోవద్దు అన్నారు.. కానీ, మీ ఫామ్ హౌస్ లో మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు అని ఆరోపించారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు పెట్టిన బాకీల కోసమే వాళ్ళు ధర్నా చేశారు.. సర్పంచుల గురించి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ వచ్చాకా ఒక్క సర్పంచ్ కూడా పని చేయలేదు.. సర్పంచుల తిప్పలకి మీ పుణ్యమే కేసీఆర్ సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. రూ. 1500 కోట్ల నిధులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.. మీరు కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు.. మీ కుటుంబ సభ్యులకు వేలాది కోట్ల రూపాయలు వచ్చాయి.. గురివింద గింజ లాగా మాట్లాడకండి కేసీఆర్ అంటూ మంత్రి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
Read Also: EX CM KCR: 20-30% కమీషన్లు అని నేను అడగటం లేదు..
అయితే, రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వస్తే.. సభను ఫెయిల్ చేయడానికి నిర్బంధం చేయలేదా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ సభకు బస్సులు కూడా ఇవ్వలేదు మీరు.. కానీ, మీ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చాం.. మేము ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మీ సభ జరిగేదా?.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి ఉందా? అని ప్రశ్నించారు. మొగుడు.. పెళ్ళాం మాట్లాడుకున్న మాటలు కూడా విన్నది మీరు.. ఫోన్ ట్యాప్ చేసిన తొత్తులను అమెరికాలో దాచిపెట్టింది మీరు కాదా అని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..