Sridhar Babu: 20 ఎంబీ స్పీడ్ తో ప్రతి ఇంటికి ఇంటర్ నెట్.. ఐటీ మంత్రి సంచలన ప్రకటన
- రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ ..
- ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం..
- ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్17 ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. ఆనాడు గడీల పాలన పై పోరాడారు… తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు గడీల పాలన ని పోగొట్టి మార్పు కోరుకున్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత 8 నెలలుగా మేము పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేంద్ర సహకారంతో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రాన్ని 9 వేల కోట్లు సాయం ఆడిగాము… ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామన్నారు.
Read also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
Also Read
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
సంగారెడ్డి జిల్లా సంగుపేట నారాయణ పేట జిల్లా మద్దూరు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరామ్ పూర్ గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసామని తెలిఆపరు. ఈ సేవల్లో ఇంటర్ నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు లభిస్తాయన్నారు. ఆయా గ్రామాల్లో 360 డిగ్రీలు సిసి కెమెరాలు, ఏఐ టెక్నాలజీ వాడతామన్నారు. పైలెట్ గ్రామాల్లో రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి డిసెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నామని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నామో నిన్న సీఎం చెప్పారన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది.. రాజీవ్ ప్రాణాలను ఇచ్చారని తెలిపారు. ఆ మహనీయుని విగ్రహం పెడితే ఎందుకు అంత అసూయ.. ఈర్ష్య అని మండిపడ్డారు. అమిత్ షా, మోడీ ల దగ్గర ప్రశంసలు పొందేందుకు బిఅరెస్ రాజీవ్ విగ్రహం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు.. బీజేపీ కి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమే ఇది అని అన్నారు. హైడ్రా అనేది రాష్ట్ర వనరులను కాపాడే వ్యవస్థ… ఇతర అంశాలను డైవర్ట్ చేసేది కాదన్నారు. ఆరు గ్యారంటీల అమలు పక్కా పూర్తి చేస్తామన్నారు.
IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!