Sridhar Babu: 20 ఎంబీ స్పీడ్ తో ప్రతి ఇంటికి ఇంటర్ నెట్.. ఐటీ మంత్రి సంచలన ప్రకటన
- రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ ..
- ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం..
- ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్17 ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. ఆనాడు గడీల పాలన పై పోరాడారు… తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు గడీల పాలన ని పోగొట్టి మార్పు కోరుకున్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత 8 నెలలుగా మేము పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేంద్ర సహకారంతో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రాన్ని 9 వేల కోట్లు సాయం ఆడిగాము… ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామన్నారు.
Read also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
సంగారెడ్డి జిల్లా సంగుపేట నారాయణ పేట జిల్లా మద్దూరు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరామ్ పూర్ గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసామని తెలిఆపరు. ఈ సేవల్లో ఇంటర్ నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు లభిస్తాయన్నారు. ఆయా గ్రామాల్లో 360 డిగ్రీలు సిసి కెమెరాలు, ఏఐ టెక్నాలజీ వాడతామన్నారు. పైలెట్ గ్రామాల్లో రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి డిసెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నామని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నామో నిన్న సీఎం చెప్పారన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది.. రాజీవ్ ప్రాణాలను ఇచ్చారని తెలిపారు. ఆ మహనీయుని విగ్రహం పెడితే ఎందుకు అంత అసూయ.. ఈర్ష్య అని మండిపడ్డారు. అమిత్ షా, మోడీ ల దగ్గర ప్రశంసలు పొందేందుకు బిఅరెస్ రాజీవ్ విగ్రహం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు.. బీజేపీ కి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమే ఇది అని అన్నారు. హైడ్రా అనేది రాష్ట్ర వనరులను కాపాడే వ్యవస్థ… ఇతర అంశాలను డైవర్ట్ చేసేది కాదన్నారు. ఆరు గ్యారంటీల అమలు పక్కా పూర్తి చేస్తామన్నారు.
IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!