Sridhar Babu: 20 ఎంబీ స్పీడ్ తో ప్రతి ఇంటికి ఇంటర్ నెట్.. ఐటీ మంత్రి సంచలన ప్రకటన
- రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ ..
- ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం..
- ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది..
Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్17 ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. ఆనాడు గడీల పాలన పై పోరాడారు… తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు గడీల పాలన ని పోగొట్టి మార్పు కోరుకున్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత 8 నెలలుగా మేము పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేంద్ర సహకారంతో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 9 వేల గ్రామాలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రాన్ని 9 వేల కోట్లు సాయం ఆడిగాము… ఇంకా 5 వేల గ్రామాల వరకు కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 3 గ్రామాలను నేట్వర్క్ పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామన్నారు.
Read also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
సంగారెడ్డి జిల్లా సంగుపేట నారాయణ పేట జిల్లా మద్దూరు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరామ్ పూర్ గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసామని తెలిఆపరు. ఈ సేవల్లో ఇంటర్ నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు లభిస్తాయన్నారు. ఆయా గ్రామాల్లో 360 డిగ్రీలు సిసి కెమెరాలు, ఏఐ టెక్నాలజీ వాడతామన్నారు. పైలెట్ గ్రామాల్లో రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి డిసెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నామని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నామో నిన్న సీఎం చెప్పారన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది.. రాజీవ్ ప్రాణాలను ఇచ్చారని తెలిపారు. ఆ మహనీయుని విగ్రహం పెడితే ఎందుకు అంత అసూయ.. ఈర్ష్య అని మండిపడ్డారు. అమిత్ షా, మోడీ ల దగ్గర ప్రశంసలు పొందేందుకు బిఅరెస్ రాజీవ్ విగ్రహం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు.. బీజేపీ కి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమే ఇది అని అన్నారు. హైడ్రా అనేది రాష్ట్ర వనరులను కాపాడే వ్యవస్థ… ఇతర అంశాలను డైవర్ట్ చేసేది కాదన్నారు. ఆరు గ్యారంటీల అమలు పక్కా పూర్తి చేస్తామన్నారు.
IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని..
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!