Harish Rao: రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది..
- రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది..
- రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..
- రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదు: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక, రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే.. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు, పలుకు లేదు అని హరీష్ రావు అన్నారు.
Read Also: AP High Court: హైకోర్టులో ఐపీఎస్ అధికారి జాషువాకి షాక్..
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
ఇక, కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దేశ సగటులో జీఎస్టీ తగ్గిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డే.. కేసీఆర్ చెట్లు పెడితే…రేవంత్ రెడ్డి నరుకుతా అంటాడు.. ఇక, హైడ్రాతో పేదల ఇల్లు కూల్చాడు.. కేసీఆర్ ది సాగు బాషా అయితే రేవంత్ రెడ్డిది చావు బాషా అని మండిపడ్డాడు. రేవంత్ రెడ్డి పని ఢిల్లీలో కూడా అయిపోయింది.. బీసీల ధర్నాకు ఢిల్లీలోనే ఉన్న రాహుల్ గాంధీ ధర్నాకు రాలేదు.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పాడు. HCU విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. HCUలో అడవులు నరికిన రేవంత్ రెడ్డికి మూగ జీవాల ఉసురు తగులుతుంది అని హరీష్ రావు శాపనార్థాలు పెట్టాడు.
Read Also: Vangalapudi Anitha: జగన్ టూర్ డ్రామాను తలపించింది.. వాట్సాప్లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు..!
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మంత్రులు కూడా వినడం లేదు అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ పాలన అంతా సగం సగం.. ఆగం ఆగం ఉందన్నారు. దేవుడినే మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి చేతికి ఇస్తే అంత ఆగం చేస్తున్నాడు.. ఏడాదిలోనే లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు.. రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లకు రంగులు మాత్రం వేస్తున్నారు.. 10 ఏళ్లు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది.. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇవ్వాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
- Tags
- BRS
- congress
- harish rao
- kcr
- ktr
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!