Jagga Reddy: దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. తెలంగాణలో రేవంత్..
- రాహుల్ గాంధీ ముందు చూపుతో కులగణన చేయాలన్నాడు..
- భారతదేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో..
- రాష్ట్రంలో కులగణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.. ఇప్పుడున్న కేంద్రం కుల గణన చేస్తామని ప్రకటన చేయడం స్వాగతిస్తున్నాం.. రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడు అనడానికి కుల గణన ఒకటి.. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. రాష్ట్రంలో కుల గణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో అని కొనియాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు సంకలు గుద్దుకున్న లాభం లేదు.. రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో అర్ధం అవుతుంది.. మోడీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయనే చేసే వాడు అని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: PM Modi Tour: ప్రధాని మోడీ అమరావతి టూర్.. 5 లక్షల మంది, 6600 బస్సులు!
Also Read
అయితే, రాష్ట్రంలో కుల గణన లెక్కలోకి రాని వారు.. కేంద్ర కుల గణనలో లెక్కకు వస్తారు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే మోడీ చెప్తే బాగుండేది అనుకుంటున్నారు.. రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుందని బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు.. రాహుల్ గాంధీ అనే వరకు మోడీ ఎందుకు ఎదురు చూశాడు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీకి ఎందుకు రాలేదంటూ సెటైర్లు వేశాడు. బీజేపీ వాళ్ళ లెక్క పదవుల కోసం ఎదురు చూసే రకం కాదు రాహుల్ కుటుంబం.. వాళ్ళే ప్రధాన మంత్రులను చేస్తారు.. కొందరికి భయం ఉంటది.. రేవంత్ కుల గణన చేసి మార్కులు కొట్టి పడేశాడన్నారు. రేవంత్ కూడా అదృష్టవంతుడు.. రాహుల్ గాంధీ లైన్ లో వెళ్లి జాక్ పాట్ కొట్టేశాడు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: Namaz: విద్యార్థులతో బలవంతంగా ‘‘నమాజ్’’ చేయించే యత్నం.. ప్రొఫెసర్ అరెస్ట్..
ఇక, కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం అన్నా లాభం లేదు అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సుష్మ స్వరాజ్ 2010లో అంటే.. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు మీరు.. మీరేం చెప్పినా కుల గణన హీరో రాహుల్ గాంధీ.. కుల గణనలో ఇతర మతాల వారు ఉండరని కిషన్ రెడ్డి కాదు మోడీ చెప్పాలి..
కిషన్ రెడ్డికి ఇష్టం లేదు కదా అని వదిలేస్తారా..?.. ప్రధాని ఏం చెప్తారో చూసి మాట్లాడదాం.. ముస్లింలు భారత దేశ పౌరులు కదా..? అని ప్రశ్నించారు. దేశంలో పుట్టిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా భారత దేశ బిడ్డలే కదా అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!